Famous TV - ఆంధ్రప్రదేశ్ / చిత్తూరు : చౌడేపల్లి జూన్ 24: చిత్తూరు జిల్లా చౌడేపల్లి మండలం గ్రామ సచివాలయ ఉద్యోగస్తులు అయినటువంటి పుంగనూరు మరియు చౌడేపల్లి కి సంబంధించినటువంటి అన్ని శాఖల వారు మంగళవారం మండల కార్యాలయం పుంగునూరు వద్ద జీవో నెంబర్ 5 యందు గల స్థానిక మండలాల విషయం గురించి నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా పుంగనూరు మండల అభివృద్ధి అధికారిణి లీలా మాధవి కి ఇరు మండలాలు అయిన పుంగనూరు మరియు చౌడేపల్లి గ్రామ సచివాలయ ఉద్యోగస్తులు వినతి పత్రాలని అన్ని శాఖల వారు కలిపి అందజేశారు ఈ సందర్భంగా అన్ని శాఖలకు సంబంధించిన గ్రామ సచివాలయ ఉద్యోగస్తులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం బదిలీల పేరుతో చిన్న ఉద్యోగస్తులు అయిన తమకు స్థానిక మండలాల లకు బదిలీలు యందు నిషేధం చేయడం బాధాకరమని వ్యక్తం చేశారు కావున రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి వార్డు సచివాలయ ఉద్యోగులకు సోమవారం విడుదల చేసిన ఉత్తర్వులు లాగే స్థానిక మండలాలలో బదిలీలకు అవకాశం ఇవ్వాలి అని కోరుతున్నారు ఒకే తల్లికి బిడ్డలాంటి గ్రామ సచివాలయం,వార్డు సచివాలయం శాఖకు సంబంధించిన గ్రామ మరియు వార్డు ఉద్యోగులను వేరువేరుగా చూడడం సరికాదని ఇందుమూలంగా విన్నవించుకున్నారు.
Admin
Famous TV