Famous TV - ఆంధ్రప్రదేశ్ / : చిత్తూరు జిల్లా, పూతలపట్టు మండలం, పేటమిట్ట మంగళ్ విద్యాలయంలో 15-12-23 మరియు 16-12-23 తేదీలలో క్రీడల పోటీ నిర్వహణ జరిగినది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన అమర్ రాజా వ్యవస్థాపకులైన డాక్టర్ గల్లా రామచంద్ర నాయుడు గారు పిల్లలను ఉద్దేశించి ఆటలు శారీరక మానసిక ఉల్లాసానికి దోహదపడతాయని తెలియజేశారు. ఈ ఆటల పోటీలలో సీబీఎస్ఈ పాఠశాలలు అయిన అమర్ రాజా విద్యాసంస్థలు మరియు బివి రెడ్డి, విజయం, పిఇఎస్ పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు. ఇందులో ప్రతిభ కనపరచిన విద్యార్థినీ విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా అమర్ రాజా విద్యాసంస్థల సెక్రటరీ ఆర్ సతీష్ గారు మరియు మంగళ్ విద్యాలయo ప్రిన్సిపాల్ జి ధనంజయ నాయుడు గారు, విద్యార్థినీ విద్యార్థులకు అభినందనలు తెలియజేశారు. ఇందులో పాఠశాల ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Admin
Famous TV