Sunday, 26 July 2026 07:35:21 AM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

మానవతా మూర్తి.. డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి

ఎస్వీయూలో 14 వ వర్ధంతి సందర్భంగా వైఎస్ఆర్ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షులు డాక్టర్ బి. ఓబుల్ రెడ్డి, రీజనల్ కోఆర్డినేటర్ లెక్కల రాజశఖరరెడ్డి

Date : 02 September 2023 04:31 PM Views : 533

Famous TV - ఆంధ్రప్రదేశ్ / తిరుపతి : మానవతా మూర్తి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి అని ఎస్వీ యూనివర్సిటీ వైస్ ఛాన్స్ లర్ ప్రొఫెసర్ రాజారెడ్డి అన్నారు. దివంగత సీఎం డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి 14 వ వర్ధంతి కార్యక్రమం ఎస్ వి యు లో వైఎస్ఆర్ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో శనివారం నిర్వహించారు ఈ సందర్భంగా వీసీ రాజారెడ్డి మాట్లాడుతూ.. ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మహానుభావుడు డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి అని తెలిపారు. విద్యారంగానికీ, పేద విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ పథకం ద్వారా మేలు చేశారని కొనియాడారు. లక్షలాది మంది పేద విద్యార్థులకు ఉన్నత విద్యను అందించిన గొప్ప నేత అని గుర్తు చేసుకున్నారు. యూనివర్సిటీల్లో ఎంతోమందికి ఉద్యోగ అవకాశాలు కల్పించారని చెప్పారు. రిజిస్టార్ హుస్సేన్ మాట్లాడుతూ.. డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి మానవీయ విలువలతో కూడిన పరిపాలన అందించారని అన్నారు. పాలకమండలి సభ్యురాలు ప్రొఫెసర్ భూమన సుగుణ రెడ్డి మాట్లాడుతూ.. వైయస్ రాజశేఖర్ రెడ్డి అత్యంత ప్రజాదరణ కలిగిన నేతని అన్నారు. అలాంటి గొప్ప నాయకున్ని కోల్పోవడం ఆంధ్రప్రదేశ్ చేసుకున్న దురదృష్టకరమని చెప్పారు. పాలకమండలి సభ్యులు సీకాం సురేందర్ రెడ్డి, జ్యోతి, టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది రాజు, మురళి, శివా నంద రెడ్డి, సుబ్రమణ్యం, చంద్ర, నవీన్ , నాగరాజు, లోకేష్, జగదీష్, రాజేంద్ర, విద్యార్థి నాయకులు మణి, ,ప్రశాంత్, ప్రదీప్, ఖేదర్, మధు నాయక్, సుబ్బు, భార్గవ్, వెంకటేష్, భూపాల్, నరసింహ, తదితరులు పాల్గొన్నారు.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :