Famous TV - ఆంధ్రప్రదేశ్ / చిత్తూరు : చౌడేపల్లి ఫేమస్ టీవి న్యూస్ : ప్రజల సౌకర్యమే అంతిమ లక్ష్యమని మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గువ్వల రమేష్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా స్థానిక బస్టాండ్ నందు ఆక్రమణ కారణంగా గత 40 సంవత్సరాలుగా పరిష్కారం కానీ సమస్యను సంబంధిత అధికారులతో కలిసి పరిష్కరించారు. ఆక్రమణల నేపథ్యంలో క్రితం తెలుగుదేశం జెండా తొలగిస్తున్న వైసిపి వారిని అడ్డుకున గువ్వల రమేష్ రెడ్డి అరెస్టు చేసి జైలుకు పంపిన సంగతి విధితమే. ఇప్పుడు కాలువల ఆక్రమణలపైన వైయస్సార్ విగ్రహం ఉన్న వాటిని తొలగించకుండా ప్రత్యాన్మయం చూపి కాలువను ఏర్పాటు చేస్తున్న రమేష్ రెడ్డి సేవలను ప్రజలు హర్షించారు.రాజకాలవ ఆక్రమణ కారణంగా ప్రజలు ఎంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల భారీ వర్షాలు పడి ప్రజలకు కాలనీవాసులకు జూనియర్ కళాశాల విద్యార్థులకు ఇబ్బందులు పడడంతో ఆయన స్వయంగా ఆక్రమణ విషయం పరిశీలించి వాటిని తొలగించాలని సంబంధిత అధికారులకు సూచించారు.నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ఆక్రమణలను తొలగించి ప్రజా సౌకర్యం కల్పించాలని కోరారు. క్షేత్రస్థాయిలో ఆక్రమణలు పరిశీలించి సంబంధిత వారితో మాట్లాడి ప్రజా సౌకర్యం కోసం సహకరించాలని కోరారు. దీనిపై ఆక్రమణ దారులు కూడా సానుకూలంగా స్పందించారు.ఆక్రమణ విషయంపై ప్రజా సౌకర్యం కల్పిస్తున్న నాయకుల పనితీరుపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు ప్రజలు పాల్గొన్నారు.
Admin
Famous TV