Famous TV - ఆంధ్రప్రదేశ్ / తిరుపతి : ఏర్పేడు, డిసెంబర్ 10 : ఏర్పేడు మండలం మేర్లపాక గ్రామపంచాయతీలోని గిరిజన కాలనీలో మిచుంగ్ తుఫాను వల్ల ఇబ్బందులు పడిన గిరిజనులు కు నిత్యవసర సరుకులు అందజేయడం జరిగింది. ప్రజలు కనీస అవసరాలు కూడా తీర్చుకోలేని ఇబ్బందికర పరిస్థితుల్లో వారికి అండగా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి ఆదేశాలతో వారికి 20 కుటుంబాలకు గాను నిత్యవసర సరుకులను పంపిణీ చేసారు.ఏర్పేడు ఇన్చార్జి కిషోర్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు మేర్లపాక సర్పంచ్ కే. గంగాధర్ నిత్యవసర సరుకులు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వీఆర్వో ప్రభాకర్ రెడ్డి , వాలంటీర్లు, వార్డు మెంబర్లు , గ్రామ ప్రజలు అందరూ పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా గిరిజనులు ముఖ్యమంత్రి జగనన్నకు, ఎమ్మెల్యే మదన్నకు రుణపడి ఉంటామని వారికి ధన్యవాదాలు తెలియజేశారు.
Admin
Famous TV