Sunday, 26 July 2026 06:18:03 AM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కరకంబాడిలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్, స్వామి వివేకానంద మరియు డాక్టర్ ఏ పి జే అబ్దుల్ కలాం గారి విగ్రహాల ఆవిష్కరణ

Date : 09 June 2023 05:43 PM Views : 812

Famous TV - ఆంధ్రప్రదేశ్ / తిరుపతి : జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కరకంబాడిలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్, స్వామి వివేకానంద మరియు డాక్టర్ ఏ పి జే అబ్దుల్ కలాం గారి విగ్రహాల ఆవిష్కరణ మహోత్సవం తిరుపతి విద్యాశాఖ అధికారి డాక్టర్ వి. శేఖర్ గారి ఆధ్వర్యంలో నిర్వహించబడినది డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని "కీ" టీవీ డైరెక్టర్ శ్రీ పరమశివన్ గారు, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి విగ్రహాన్ని తిరుపతి విద్యాశాఖ అధికారి డాక్టర్ వి శేఖర్ గారు., స్వామి వివేకానంద గారి విగ్రహాన్ని కాణిపాకం ఈవో మరియు డిప్యూటీ కలెక్టర్ అయిన శ్రీ వెంకటేష్ గారు ఆవిష్కరించారు.

పాఠశాలలో యోగ మరియు మెడిటేషన్ హాలుకు విశ్రాంత ప్రిన్సిపల్ శ్రీ కంచి రఘురాం గారు భూమి పూజ చేసారు. తిరుపతి విద్యాశాఖ అధికారి శ్రీ డాక్టర్ వి శేఖర్ గారు ప్రసంగిస్తూ పాఠశాల స్థాయిలో ఇలాంటి గొప్ప వారి యొక్క విగ్రహాలు ఆవిష్కరించడం వలన వారు సమాజానికి చేసినటువంటి సేవను గురించి విద్యార్థులకు తెలియ చెప్పవచ్చునని తెలియజేశారు.. కాణిపాకం ఈవో గారు ప్రసంగిస్తూ ఇలాంటి విగ్రహాలు ఏర్పాటు చేయడం వల్ల విద్యార్థులలో సేవాస్ఫూర్తిని పెంపొందించవచ్చని గొప్ప గొప్ప సైంటిస్టులుగాను, మానవతావాదులుగాను తయారు చేయవచ్చునని తెలియజేశారు... పరమశివం గారి ప్రసంగిస్తూ అంబేద్కర్ ప్రపంచ మేధావి అని అంబేద్కర్ జీవితం ప్రతి వ్యక్తికి ఆదర్శప్రాయమని కొనియాడారు.. కంచి రఘురాం గారు ప్రసంగిస్తూ ప్రతి వ్యక్తి మానసికంగా ఎదగాలని మానసిక ప్రశాంతత కోసం ధ్యానం చేయాలని తెలియజేశారు

రాబోయే రెండు నెలల్లో ధ్యాన మందిరాన్ని పాఠశాలలు ఏర్పాటు చేసి పాఠశాలలోని విద్యార్థులు ఉపాధ్యాయులు అందరూ కూడా ధ్యానవంతులుగా అయ్యేటట్టు డ్యానామందిరాన్ని నిర్మిస్తామని తెలియజేశారు ..రిటైర్డ్ ప్రిన్సిపల్ డాక్టర్ శ్రీ నారాయణ స్వామి గారు ప్రసంగిస్తూ విద్యార్థులకు దేశ నాయకులు యొక్క ఔన్నత్యాన్ని తెలియజేయాలని అబ్దుల్ కలాం అంబేద్కర్ మరియు వివేకానందుల జీవిత చరిత్రను తెలియజేయాలి అని తెలియజేశారు.. పాఠశాల ప్రధానోపాధ్యాయులకు శ్రీ ఆనంద్ గారు ఈ విగ్రహాలను పాఠశాలలు ఏర్పాటు చేసినందుకు సహకరించి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ వీరి జీవిత చరిత్ర విద్యార్థులకు స్ఫూర్తిదాయకమని తెలియజేశారు.. పాఠశాలలో కాణిపాకం EO గారి చేతుల మీదుగా ప్రగతి ఆర్గనైజేషన్ వారి సమక్షంలో బాల్యవివాహాల రద్దు సంబంధించినటువంటి గోడ పత్రికను ఆవిష్కరించడం జరిగినది.ఈ కార్యక్రమంలో తిరుపతి "సేవ్" నర్సింగ్ కాలేజ్ కరస్పాండెంట్ శ్రీ ప్రవీణ్ గారు ప్రగతి ఆర్గనైజేషన్ శ్రీ రమణ గారు, టిటిడి ఈఈ మనోహరం గారు, పంచాయతీరాజ్ AO కోమలేశ్వరి గారు , వే ఫౌండేషన్ అధ్యకులు డా. అంకయ్యగారు,హ్యూమన్ రైట్స్ ఇంచార్జి డా. కె. సి. కుసుమ కుమారి... కలాం ట్రస్ట్ అధ్యక్షులు భాష గారు... యువతేజం ట్రస్ట్ అధ్యక్షులు కరీముల్లా గారు... నిర్మల గారు రామరాజు గారు పాల్గొన్నారు

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: