Famous TV - ఆంధ్రప్రదేశ్ / : బనగానపల్లె మండలం చెరుపల్లి గ్రామంలోని ప్రాథమిక ఉన్నత పాఠశాల యందుశ్రీ జె కె ఆర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు శ్రీ జే ఎస్ ఎస్ బ్రహ్మానంద చారి ఆధ్వర్యంలో తిరుపతి పట్టణానికి చెందిన ఏ ఫౌండేషన్ అధ్యక్షుడు పైడి అంకయ్య గారి సహకారంతో పాఠశాలలోని 75 మంది విద్యార్థులకు నోటు పుస్తకాలు పెన్నుల పంపిణీపచ్చని చెట్లు ప్రగతికి మెట్లు పర్యావరణ విద్య ఆవశ్యకతపై సదస్సు ఏర్పాటు చేయడం జరిగినది.ఈ సదస్సును ఉద్దేశించి బ్రహ్మాండచారి మాట్లాడుతూ పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అని అన్నారు.పర్యావరణానికి పచ్చదనం ఆరోగ్యానికి పరిశుభ్రత ఎంతో అవసరం అన్నారు.మానవ మునగడకు చెట్లు ఎంతో అవసరమని అన్నారు.ప్రతి ఒక్కరు తమ వంతు బాధ్యతగా పది చెట్లను పెంచాలని కోరారు పాఠశాల యత్యంఎం సి రామ నరసింహులు మాట్లాడుతూఈ కార్యక్రమం దాతైనఏ ఫౌండేషన్ అధ్యక్షుడు పైడి అంకయ్యకు కృతజ్ఞతలు తెలిపారు.విద్యా విశిష్టతను గురించి వివరించారు.ఈ కార్యక్రమంలోహెచ్ఎంఎం రామ నర్సింహులు ఉపాధ్యాయులు జయ భారతి,ఎస్ ప్రమీలమ్మ ,సచివాలయ సిబ్బంది ,రవి ,శివ ,రాజేశ్వరి ,పర్వీన్, చంద్రకళ మరియు తలారి సుబ్బరాయుడు భాష విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.అనంతరం పాఠశాలలోని 75 మంది విద్యార్థులకునోటు పుస్తకాలు పెన్నులు పంపిణీ చేశారు.
Admin
Famous TV