Monday, 27 July 2026 08:56:04 AM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

పలు మండలాల్లో పర్యటించిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

Date : 22 June 2025 06:54 PM Views : 591

Famous TV - ఆంధ్రప్రదేశ్ / చిత్తూరు : చౌడేపల్లి ఫేమస్ టీవి న్యూస్ : చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలోని, సదుం, సోమల,చౌడేపల్లి, పుంగనూరు మండలాల్లో ఆదివారం మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయనకు స్థానిక నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలుకుగా మహిళలు మంగళ హారతులు పట్టారు. అనంతరం ఆయన మండలాల్లోని నాయకులతో సమావేశమై రాజకీయ పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారు. పార్టీ అభివృద్ధికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఎమ్మెల్యే పెద్దిరెడ్డి సూచించారు. పుదిపట్ల పంచాయతీలో తిరుమనపల్లి శివశంకర్ నివాసం నందు నూతన వధూవరును ఆశీర్వదించారు.అనంతరం పుంగనూరు మున్సిపాలిటీలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ మన రాష్ట్రంలో దాదాపు 75% రైతులు వ్యవసాయంపై ఆధారపడి బతుకుతున్నారు. రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించేందుకు జగన్మోహన్ రెడ్డి వెళుతుంటే వైసీపీ నాయకులను కూటమి ప్రభుత్వం వేధిస్తున్నారు ఫైర్ అయ్యారు. గిట్టుబాట ధర లేకుండా రైతులు అవస్థలు పడుతుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పట్టించుకోవటం లేదని మాజీ మంత్రి పెద్దిరెడ్డి ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో మాజీ చిత్తూరు ఎంపీ రెడ్డప్ప, మాజీ జడ్పీ వైస్ చైర్మన్ పెద్దిరెడ్డి, జడ్పిటిసి దామోదర్ రాజు, మాజీ ఎంపీపీలు అంజిబాబు, రూపినమ్మ,వైస్ ఎంపీపీలు నరసింహారెడ్డి, సుధాకర్ రెడ్డి, మండల అధ్యక్షుడు నాగభూషణం రెడ్డి,మాజీ సింగల్ విండు చైర్మన్ రవిచంద్ర రెడ్డి,పి.హెచ్.సి. మాజీ చైర్మన్ కళ్యాణ్ భరత్ యువ నాయకుడు మిద్దింటి కిషోర్. మండలాల్లోని ఎంపీటీసీలు, సర్పంచులు. వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Vuttaradi Hariprasad

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :