Famous TV - ఆంధ్రప్రదేశ్ / చిత్తూరు : చౌడేపల్లి ఫేమస్ టీవి న్యూస్ : చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలోని, సదుం, సోమల,చౌడేపల్లి, పుంగనూరు మండలాల్లో ఆదివారం మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయనకు స్థానిక నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలుకుగా మహిళలు మంగళ హారతులు పట్టారు. అనంతరం ఆయన మండలాల్లోని నాయకులతో సమావేశమై రాజకీయ పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారు. పార్టీ అభివృద్ధికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఎమ్మెల్యే పెద్దిరెడ్డి సూచించారు. పుదిపట్ల పంచాయతీలో తిరుమనపల్లి శివశంకర్ నివాసం నందు నూతన వధూవరును ఆశీర్వదించారు.అనంతరం పుంగనూరు మున్సిపాలిటీలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ మన రాష్ట్రంలో దాదాపు 75% రైతులు వ్యవసాయంపై ఆధారపడి బతుకుతున్నారు. రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించేందుకు జగన్మోహన్ రెడ్డి వెళుతుంటే వైసీపీ నాయకులను కూటమి ప్రభుత్వం వేధిస్తున్నారు ఫైర్ అయ్యారు. గిట్టుబాట ధర లేకుండా రైతులు అవస్థలు పడుతుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పట్టించుకోవటం లేదని మాజీ మంత్రి పెద్దిరెడ్డి ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో మాజీ చిత్తూరు ఎంపీ రెడ్డప్ప, మాజీ జడ్పీ వైస్ చైర్మన్ పెద్దిరెడ్డి, జడ్పిటిసి దామోదర్ రాజు, మాజీ ఎంపీపీలు అంజిబాబు, రూపినమ్మ,వైస్ ఎంపీపీలు నరసింహారెడ్డి, సుధాకర్ రెడ్డి, మండల అధ్యక్షుడు నాగభూషణం రెడ్డి,మాజీ సింగల్ విండు చైర్మన్ రవిచంద్ర రెడ్డి,పి.హెచ్.సి. మాజీ చైర్మన్ కళ్యాణ్ భరత్ యువ నాయకుడు మిద్దింటి కిషోర్. మండలాల్లోని ఎంపీటీసీలు, సర్పంచులు. వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
Admin
Famous TV