Sunday, 26 July 2026 01:38:54 AM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

తుడా చైర్మెన్ గా చెవిరెడ్డి మోహిత్ రెడ్డి

పూర్తి స్థాయి రాష్ట్ర పార్టీ వ్యవహారాల్లో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నిమగ్నం

Date : 19 August 2023 08:31 AM Views : 1516

Famous TV - ఆంధ్రప్రదేశ్ / తిరుపతి : * ** తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ (తుడా) ఛైర్మెన్ గా చంద్రగిరి 2024 వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ విప్, చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సీఎం జగన్మోహన్ రెడ్డి అప్పగించిన రాష్ట్ర పార్టీ వ్యవహారాల్లో పూర్తి స్థాయిలో నిమగ్నం కానున్నారు. *చంద్రగిరి ప్రజలకు సేవ చేయడమే లక్ష్యంగా..* ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తనయుడు తిరుపతి రూరల్ ఎంపీపీ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి 2024 వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో నిలిచారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వ అధికారిక కార్యక్రమం గడప గడపకు పర్యటిస్తున్న క్రమంలో ప్రతిపక్ష పార్టీ టిడిపి నేతలు విమర్శలకు దిగారు. ఏ అధికారిక హోదాలో మోహిత్ రెడ్డి పర్యటిస్తున్నారని, ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు ఎలా వెంట తిరుగుతున్నారని జిల్లా ఉన్నతాధికారులకు పిర్యాదులు చేశారు. ఈ అంశాన్ని ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సీఎం జగన్మోహన్ రెడ్డికి దృష్టికి తీసుకెళ్లారు. 2024 ఎమ్మెల్యే అభ్యర్థి ప్రజలతో మమేకమవడం, ప్రజలకు సేవ చేసేందుకు అవకాశం ఉంటుందన్న క్రమంలో సీఎం చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి తుడా ఛైర్మెన్ బాధ్యతలు అప్పగించారు. ఇకపై చెవిరెడ్డి మోహిత్ రెడ్డి చంద్రగిరి నియోజకవర్గంలో అధికారిక తుడా ఛైర్మెన్ హోదాలో పర్యటించనున్నారు.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :