Famous TV - ఆంధ్రప్రదేశ్ / అన్నమయ్య ( రాయచోటి ) : అన్నమయ్య జిల్లా,పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి మండలంలోని కాగతి గ్రామపంచాయతీ, యనమసామనపల్లి కి చెందిన రైతు ఏడూరు గంగరాజు తన ఐదు ఎకరాల పొలంలో టమాట జయహో టమాట నారును తమ ప్రక్క గ్రామమైన యల్లంపల్లి నందుగల నరసింహారెడ్డి నర్సరీ నందు ఒకలాట్ మొత్తం ముప్పై ఐదువేల జయహో టమాటా నారు కొనుగోలు చేసి నాటారు. ఐతే అతను గత ఇరవై సంవత్సరాలనుండి వ్యవసాయం చేస్తున్ననూ ఇప్పటి వరకు ఎటువంటి ఇబ్బందులు కలగలేదని, ఐతే ఈ ఏడు యల్లంపల్లి నరసింహ రెడ్డి నర్సరీ నందు విత్తనాలు నఏను తీసిస్తానని చెప్పినా వినకుండా ఆయనే సొంతంగా విత్తనాలు కొనుగోలు చేసి నారు ఇచ్చాడని, ఐతే వీటికి 35 లోడ్లు పశువుల ఎరువు, కోళ్ళ ఎరువు తోలడం జరిగిందని, నీళ్ళు పుష్కలంగా ఉన్నాయని ఆయన వాపోయారు. ఇప్పటి వరకు సుమారు పన్నెండులక్షలు ఖర్చులు పెట్టానని, ప్రస్తుతం కాయలు అన్ సైజ్ వచ్చాయని గోళీలు కావడంతో వాటిని పారబోయడానికి తప్ప ఇంకేమిటికి పనికి రావని, ఇంత పెట్టుబడి పెట్టి లాభం లేదని రైతు గంగరాజు వాపోయాడు. ఈ సందర్బంగా అతని భార్య కళావతమ్మ మాట్లాడుతూ గత రెండీ మూడు రోజుల నుండి నా భర్త చాలా వరకు డిప్రెషన్ లో ఉన్నారని ప్రతి రోజు ఆరువందల బాక్సులు అవుతున్నాయని, నలబై మంది కూలీలు అవసరం ఉందని నా భర్త ఎప్పుడు ఎటువంటి అఘాత్యాలకి పాల్పడుతాడోనని అనునిత్యం కాపలా గా ఉన్నామని, అధికారులు నకిలీ నారు ఇచ్చిన నరసింహారెడ్డి పైన చట్ట రిత్యా చర్యలు తీసుకొని, మాకు న్యాయం చేయాలని అన్నారు.
Admin
Famous TV