Monday, 27 July 2026 09:51:17 AM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

ప్రజల్లో మార్పు స్పష్టంగా కనిపిస్తుంది - ఇంటింటి ప్రచారంలో పులివర్తి నాని

ఎన్నికలు కోసం ఎదురుచూస్తున్నారు -టీడీపీ భారీ మెజార్టీ సాధిస్తుంది

Date : 09 March 2024 07:13 PM Views : 732

Famous TV - ఆంధ్రప్రదేశ్ / తిరుపతి : వైసీపీ అరాచక పాలనలో ప్రజలు విసిగిపోయారని, ప్రజలు మార్పు కోరుకోవడం స్పష్టంగా కనిపిస్తుందని చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ పార్లమెంటు అధ్యక్షుడు, చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని అన్నారు. మీ ఇంటి వద్దకు మీ పులివర్తి నాని, బాబు ఘారిటి భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా ఆయన తిరుపతి రూరల్ మండలం, బ్రహ్మణపల్లి పంచాయితీలో పర్యటించారు. ఈ సందర్భంగా జనసేన, టీడీపీ నాయకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం పులివర్తి నాని ఇంటింటికి తిరుగుతూ ప్రజల సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను గురించి వివరించారు. సూపర్ సిక్స్ పథకాలపై అవగాహన కల్పిస్తూ ప్రచారం చేపట్టారు. ఈ ఐదేళ్ళ వైసీపీ పాలనలో ఏ వర్గానికి న్యాయం జరగలేదని పులివర్తి నాని అన్నారు. బాదుడే.. బాదుడు తప్ప.. ప్రజల సమస్యల్ని పట్టించుకోవడం విస్మరించారని ధ్వజమెత్తారు. కరెంట్, పెట్రోల్, డీజిల్ ధరలు, నిత్యావసర వస్తువుల ధరలు, కరెంట్ చార్జీలు విపరీతంగా పెంచేశారని ఆరోపించారు. మద్యపాన నిషేధం చేస్తామని హామీ ఇచ్చి కల్తీ మద్యంతో ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని పేర్కొన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక వలస పోతున్నారని అన్నారు. ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అక్రమంగా తరతరాలుగా సరిపడా సంపాదించేశారని ఆరోపించారు. మఠం భూములు స్వాహా చేసి వెంచర్లు వేసి అమాయకపు ప్రజలకు అమ్మేశారని మండిపడ్డారు. మఠం భూముల్లో అక్రమ కట్టడాలు అంటూ ఎండోమెంట్ అధికారులతో కలిసి మళ్లీ కబ్జాకు తెరలేపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల కోడ్ రాకముందే తాయిలాలు పంచుతూ ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘిస్తున్నారని వెల్లడించారు. పర్యటిస్తున్న ప్రతి చోటా ప్రజలు ఎన్నికలు ఎప్పుడు వస్తాయా‌‌ అని ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. ఖచ్చితంగా భారీ మెజారిటీతో తెలుగుదేశం పార్టీ గెలవబోతోందని పులివర్తి నాని స్పష్టం చేశారు. చంద్రగిరి కోటపై పసుపు జెండా రెపరెపలు చూడబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :