Famous TV - ఆంధ్రప్రదేశ్ / తిరుపతి : సోమవారము ఎస్ వి వైద్య కళాశాల ప్రాంగణము ప్రసూతి ఆసుపత్రికి ఎదురుగా పోస్ట్ గ్రాడ్యుయేట్ వైద్య విద్యార్థుల కొరకు నూతన వసతి గృహాన్ని ప్రారంభిం. ఎస్వీ వైద్య కళాశాల అదనపు వైద్య విద్య సంచాలకులు మరియు ప్రిన్సిపాల్ డాక్టర్ చంద్రశేఖరన్ ఆధ్వర్యంలో, ముఖ్యఅతిథిగా తిరుపతి శాసనసభ్యులు మరియు టీటీడీ ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ కరుణాకర్ రెడ్డి, చేతుల మీదుగా ప్రారంభోత్సవం. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గౌరవనీయులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, వైద్యం మీద ప్రత్యేక శ్రద్ధ వహించి, ఎన్నో కార్యక్రమాలు పేదలకు అందిస్తున్నరు. అందులో భాగంగా వైద్యం అందించే పీజీ వైద్య విద్యార్థులకు వసతి గృహం ఎంతైనా అవసరం ఉందని గ్రహించి. పేద రోగులకు మెరుగైన వైద్యం అందించడంలో వాళ్ల పాత్ర ఎంతో ఉంటుంది కనుక , వారికి ఆసుపత్రి, వైద్య కళాశాల ప్రాంగణంలోనే మెరుగైన అధునాతన వసతులతో వైద్య విద్యార్థుల కొరకు వసతి గృహాన్ని ఈరోజు వైద్య విద్యార్థులకు కేటాయించడం జరుగుతున్నది. ఇకమీదట పోస్ట్ గ్రాడ్యుయేట్ వైద్య విద్యార్థులు వసతి గృహం లేదనే భావన లేకుండా మెరుగైన వైద్యం అందిస్తూ మెరుగైన వైద్య విద్యను నేర్చుకొని తిరుపతి ఎస్వీ వైద్య కళాశాలను ప్రగతి పథంలో నిలుపుతారని ఆశిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. పోస్ట్ గ్రాడ్యుయేట్ వైద్య విద్యార్థుల కోసం హాస్టల్ భవనం నిర్మాణం (పురుషులు) , తిరుపతి ఎస్ వి .వైద్య కళాశాల ఆవరణలో 200 మంది విద్యార్థులకు మరియు వంటగది కమ్ డైనింగ్ హాళ్లకు రూ . 1675.00 లక్షలు, హాస్టల్ బ్లాక్లోని తిరుపతి ( G + 2 ) గదులు - 209 సంఖ్యలు , వార్డెన్ గది - 1, అడ్మిన్ గది - 1 , టాయిలెట్ బ్లాక్లు - 6 , వాషింగ్ ఏరియా - 3 డైనింగ్ హాల్ , కిచెన్ ఏరియా , మీడియా రూమ్ , జిమ్ / ఇండోర్ స్పోర్ట్స్ రూమ్ ఇందులో ఉన్నవి. ఈ కార్యక్రమంలో తిరుపతి పార్లమెంటు సభ్యులు డాక్టర్ గురుమూర్తి, తిరుపతి నగర మేయర్ డాక్టర్ ఆర్ శిరీష, ఎస్వీ వైద్య కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ వెంకటేశ్వర్లు, (పరిపాలన), డాక్టర్ సునీత, (అకాడమిక్ ), రుయా ఆసుపత్రి సూపరి టెండెంట్ డాక్టర్ జి రవి ప్రభు, ప్రసూతి ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ పార్థసారధి రెడ్డి, పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ వార్డెన్ డాక్టర్ శ్రీకాంత్ రెడ్డి, డాక్టర్ సుబ్బారావు, డాక్టర్ కిరీటి, యు జి.హాస్టల్ వార్డెన్ డాక్టర్ తులసీరామ్, ఏపీ.ఎమ్స్.ఐ. డి. సి. సూపర్డెంట్ ఇంజనీర్ కృష్ణారెడ్డి, లక్ష్మీపతి రెడ్డి ఈ ఈ, చిదంబరం ఎలక్ట్రికల్ ఈఈ, సురేష్ కుమార్ డి.ఈ,ఈ, హరి ప్రసాద్ రెడ్డి ఎలక్ట్రికల్ డి ఈ, ఈ, 23వ వార్డు కార్పొరేటర్ వెంకటేశ్వర్లు, కాంట్రాక్టర్ ముని మోహన్ రెడ్డి పీజీ, యూజీ వైద్య విద్యార్థులు మరియు ఎస్ వి వైద్య కళాశాల పిఆర్ఓ వీరకిరణ్ పాల్గొన్నారు.
Admin
Famous TV