Famous TV - ఆంధ్రప్రదేశ్ / చిత్తూరు : చౌడేపల్లి ఫేమస్ టీవి న్యూస్ : చిత్తూరు జిల్లా, చౌడేపల్లి మండలం, దిగువపల్లి గ్రామపంచాయతీ లో వెలసిన ప్రముఖ పుణ్యక్షేత్రం,శక్తి క్షేత్రం బోయకొండ గంగమ్మ ఆలయం ఆధ్వర్యంలో నడపబడుతున్న గో సంరక్షణ పథకానికి దాత 51 వేల రూపాయలను విరాళంగా అందించారు. ఈ మేరకు ఆదివారం ఆలయంలో కార్యనిర్వాహణాధికారి మరియు ఉప కమిషనర్ ఏకాంబరంకు దాతలు తమిళనాడు రాష్ట్రం,కృష్ణగిరి కి చెందిన అరుణ్ కుమార్,మౌనికలు నగదును అందించారు వీరికి ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శన భాగ్యం కల్పించి పవిత్ర తీర్థప్రసాదాలు అందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికార అర్చక సిబ్బంది పాల్గొన్నారు.
Admin
Famous TV