Famous TV - ఆంధ్రప్రదేశ్ / తిరుపతి : జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పల్లం పాఠశాలలో గతకొంతకాలంగా నీటి సమస్యఉండేది, ఈ పాఠశాలలో నీటి సమస్యను పరిష్కరించాలని మండల ఇన్చార్జ్ కిషోర్ రెడ్డిగారు, ఎంపీపీ గీతగారు ,జడ్పిటిసి తిరుమలయ్య గారు, మరియు ఎంపీడీవో గారి దృష్టికి తీసుకెళ్లగా వారు వెంటనే స్పందించి పాఠశాలలో "చేతి బోరు"ను ఏర్పాటుచేసి పాఠశాలలో ఉన్నటువంటి నీటి సమస్యకు శాశ్వతంగా పరిష్కారం చేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ టీ .ఆనంద్ గారు మాట్లాడుతూ గత కొంతకాలంగా పాఠశాలలో నీటిసమస్య ఉండేదని, నీటిసమస్యతో బాలికలకు చాలా అసౌకర్యంగా ఉండేదని తెలియజేశారు , గత కొంతకాలంగా అపరిష్కృతంగా ఉన్నటువంటి నీటి సమస్యను పరిష్కరించిన అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు, ఈ నీటి సమస్యను పరిష్కరించడానికి కృషి చేసినటువంటి నియోజకవర్గ సీనియర్ నాయకులు మరియు పాఠశాల గౌరవాధ్యక్షులు అయిన శ్రీ చంద్రశేఖర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గోపాల్ గారు పాఠశాల కమిటీ చైర్మన్ సుధాకర్ రెడ్డి గారు ఉపాధ్యాయులు మిత్రులు పాల్గొన్నారు.
Admin
Famous TV