Monday, 27 July 2026 07:50:39 AM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

ఘనంగా కృష్ణదేవరాయ విద్యా సాంస్కృతిక ట్రస్ట్ 48వ వార్షికోత్సవ వేడుకలు

Date : 02 October 2023 05:35 PM Views : 574

Famous TV - ఆంధ్రప్రదేశ్ / తిరుపతి : ప్రతిభ కలిగి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న విద్యార్థులకు ఆర్థిక సాయం చేయాలని సంకల్పించి, అమరరాజ సంస్థల అధినేత డాక్టర్ గల్లా రామచంద్ర నాయుడు గారు కృష్ణదేవరాయ విద్యా సాంస్కృతిక ట్రస్ట్ ను స్థాపించి,అందులో ఎంతో మంది దాతలను భాగస్వాములను(విలీనం)చేసి ఉపకార వేతనాలను అందిస్తున్నారు. అందులో భాగంగా గత 48 సంవత్సరాలుగా ఈ సేవలు కొనసాగిస్తున్నారు. అందులో భాగంగా సోమవారం పూతలపట్టు మండలంలోని పేటమిట్టలో ఉన్న మంగళ్ విద్యాలయంలో 48వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.గాంధీ జయంతిని పురస్కరించుకొని 150 మంది మెడిసిన్,ఇంజనీరింగ్, పదవ తరగతిలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు 40 లక్షల వరకు ఉపకార వేతనాలను అందజేశారు. ఈ సందర్భంగా అమరరాజా సంస్థల అధినేత డాక్టర్ గల్లా రామచంద్ర నాయుడు గారు మాట్లాడుతూ "గ్రామీణ విద్యార్థుల అభ్యున్నతే ధ్యేయంగా ఈ ట్రస్ట్ ను స్థాపించామని, 1968లో 100రూపాయల పెట్టుబడితో ఈ ట్రస్టు స్థాపించగా నేడు 5 కోట్ల వరకు చేరిందన్నారు. విద్యార్థులు భవిష్యత్తులో స్థిరపడి ఈ సంస్థకు చేయూతనిస్తే మరి కొంత మందికి సాయం చేయవచ్చునని సూచించారు. ఈ ట్రస్టుకు విరాళాలు అందజేస్తున్న దాతలకు తన కృతజ్ఞతలు తెలిపారు." ఇక ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన K.N.సత్యనారాయణ గారు ( Director IIT Tirupati) మాట్లాడుతూ "వేలాది మంది నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించి, ఆదుకుంటున్న గల్లా కుటుంబాన్ని ముందుగా అభినందించారు. ఈ సంస్థకు విరాళాలు ఇచ్చి తమ దాతృత్వాన్ని చాటుతున్న వారందరినీ అభినందిస్తూ, విద్యార్థులు బాగా చదివి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆశీర్వదించారు." ప్రవాసాంధ్ర భారతీయులు డాక్టర్ గౌరనేని రమాదేవి గారు మాట్లాడుతూ "విద్యార్థులందరూ విలువలతో కూడిన విద్యను అభ్యసించి దేశ పురోగతికి తోడ్పడాలన్నారు." అనంతరం విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాల అలరించాయి. ఈకార్యక్రమంలో ఈ సంస్థ కార్యదర్శి గల్లా విజయ నాయుడు గారు, కార్యవర్గ సభ్యులైన మహదేవ నాయుడుగారు, సతీష్ గారు,బాలాజీ కిరణ్ గారు,గల్లా రాజశేఖర్ గారు,మంగళ విద్యాలయ ప్రిన్సిపల్ ధనంజయ నాయుడు గారు,స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ డీన్ రవికుమార్ గారు, ఉపాధ్యాయ బృందం, తదితరులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :