Famous TV - భక్తి / అన్నమయ్య ( రాయచోటి ) : అన్నమయ్య జిల్లా, పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి మండలంలోని పుదిపట్లలో వెలసివున్న స్వయంభు శ్రీ వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా వైష్ణవి దేవికి, ఆభయాంజనేయస్వామికినాగభైరవ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేశంలో ఎక్కడా లేని విధముగా ఇక్కడ మహిళ అర్చకురాలు ఉండటం ఈ ఆలయ ప్రత్యేకత అని చెప్పవచ్చును. ఉదయాన్నే ఆలయ ప్రధాన అర్చకురాలు శ్రావణి పంచామృతాభిషేకం చేసి, అనంతరం అమ్మవారికి వివిధ రకాల పూలతో అలంకరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు.పౌర్ణమి రోజు ఉభయ దారులుగా కర్ణాటక రాష్ట్రం చింతామణికి చెందిన వెంకటేశ్వర్లు ధర్మపత్ని రజిని వ్యవహరించారు. పుంగనూరు, చింతామణి, మదనపల్లి, చౌడేపల్లి, సోమల, పలమనేరు తదితర ప్రాంతాల నుండి భక్తులు అశేష సంఖ్యలో పాల్గొన్నారు. ఆలయ ధర్మకర్త వినోద్ కుమార్ భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. తమ కోర్కెలు తీరిన భక్తులు అన్నదానం చేశారు.
Admin
Famous TV