Famous TV - ఆంధ్రప్రదేశ్ / చిత్తూరు : చౌడేపల్లి ఫేమస్ టీవి న్యూస్: చిత్తూరు జిల్లా చౌడేపల్లి మండలంలోని యానాది కాలనీకి చెందిన ఇరువురం రెడ్డప్ప రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు ఇతనికి ఐదు మంది పిల్లలు ఇతని భార్య ఇరువారం రాజేశ్వరి 77 ఏళ్ళ భారతదేశంలో కనీస గుర్తింపు కార్డుకి కూడా లేని ఎస్టీ (యానాదులు)గా పిలవబడే చెంచులు. పుట్టిన తేదీ, ఆధార్ కార్డు కూడా లేని దుస్థిలో ఉన్నారంటే యానాదులు పట్ల ప్రభుత్వం రాజకీయనాయకులు, అధికారులు ఎంత నిర్లక్ష్యం వహిస్తున్నారో వారి పిల్లలను చదివించాలని ఉన్న కనీస ఆధారాలు లేకపోవడం వలన పాఠశాలలో చేర్పించుకోలేమంటూ పాఠశాల యాజమాన్యాలు చేతులెత్తెస్తున్నాయి. వీరిని చూసిన ఏవి తెలుగు న్యూస్ రాయలసీమ ఇంచార్జ్ డాక్టర్ మహేష్ దంపతులు వారికి జనన ధ్రువీకరణ పత్రాలు చేపించి చౌడేపల్లిలో మా స్వరూపదేవి బట్టలషాప్ యాజమాన్యం శరవణ ఐదుమంది పిల్లలకు నూతన వస్త్రాలను దానం చేసారు ఏవి తెలుగు న్యూస్ రాయలసీమ ఇంచార్జి డాక్టర్ మహేష్ పిల్లలకు దుస్తులు పెన్నులు పలకలు దుప్పట్లు మరికొన్ని వస్తువులు వీరికి కొనిచ్చారు. వీరికి ఏమి వస్తువులు కావాలన్నా మేము కొనిస్తామని వాళ్ళ చదువుకు అయ్యే ఖర్చులు బరిస్తామని, ప్రభుత్వం యానాధుల పట్ల ద్రుష్టి సారించి వారికి గుర్తింపు కార్డులను అందించాలని ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలను వారికి చేరే విధంగా చర్యలు చేపట్టాలని డాక్టర్ మహేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాడు. డాక్టర్ మహేష్ దంపతులు చేస్తున్న సేవలకు ప్రజలు వర్షం వ్యక్తం చేశారు.
Admin
Famous TV