Monday, 27 July 2026 07:47:54 AM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

వేసవి సెలవుల సరదా విషాదం కాకూడదు..పిల్లలు ఈతకు వెళ్లే జలపాతాలు, నదులు, ఇతర ప్రమాదకర ప్రదేశాల వద్ద అవసరమైన హెచ్చరిక బోర్డులు ఏర్పాటు

ఈతకు వెళ్లి ప్రాణాల మీదకు తెచ్చుకోకండి. ఒంటరిగా ఈతకు వెళ్లకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్.జిల్లా ఎస్పీ శ్రీ పి. పరమేశ్వర రెడ్డి

Date : 02 June 2023 05:20 PM Views : 536

Famous TV - ఆంధ్రప్రదేశ్ / తిరుపతి : ప్రస్తుతం వేసవి సెలవులు... కావున పిల్లలు, యువకులు సరదాగా జలపాతాలు, కాలువలు, బావులు, చెరువులు, సముద్ర తీరానికి వెళుతుంటారు. కాలువలు, బావులు, చెరువులలో ఈతకు దిగినప్పుడు, సముద్ర తీరాల యందు మునిగేటప్పుడు ప్రమాదాలకు గురి అవుతున్న సందర్భాలు మనం నిత్యం చూస్తూనే ఉంటున్నామని జిల్లా ఎస్పీ శ్రీ పి.పరమేశ్వర రెడ్డి ఐ.పి.యస్., గారు తెలిపారు. పిల్లలు ఈతకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, చిన్నారులకు ఈతరాకపోతే కలిగే ప్రమాదాల గురించి వివరించాలన్నారు. తల్లిదండ్రులే స్వయంగా వారి పిల్లలను వెంటబెట్టుకుని వెళ్లి దగ్గరుండి ఈత నేర్పించాలని సూచించారు. ఈతరానివారు స్నేహితులతో బావులు, కాలువలు, చెరువులు, కుంటలలో ఈతకు వెళితే వాటిలోతు తెలియని కారణంగా ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంటుందన్నారు. బావులు, కాలువలు, జలపాతాలు చెరువులు, కుంటలలో ఈత కొట్టేముందు ఈత వచ్చిన వాళ్ళు సైతం వాటి లోతు ఎంత అనే విషయం కర్రల సాయంతో చూసుకోవాలన్నారు. సముద్ర తీర ప్రాంతాలకు విహార యాత్రలకు వెళ్లిన సమయంలో ఎక్కువ లోతులోకి వెళ్లకుండా పోలీస్ వారు సూచించిన నిర్దిష్ట లోతులోనే మునగాలన్నారు. మద్యం మత్తులో నీటిలోకి దిగే ప్రయత్నం చేయటం మంచిది కాదని జిల్లా ఎస్పీ గారు సూచించారు. వేసవి సెలవుల సరదా విషాదం కాకూడదు...ముఖ్యంగా జలపాతాలు, బావులు, చెరువులు, కాలువలు, నదులు, సముద్రం ఉన్నాయి. వేసవికాలంలో పిల్లలు విహార యత్ర అని, సరదా అని ఈత కు వెళుతుంటారు. ఆ ప్రదేశాలను గుర్తించి అక్కడ ప్రమాదపు హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయాలన్నారు.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :