Monday, 27 July 2026 07:51:39 AM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా వారి దౌర్జన్యాలను, వారి డ్రామాలు చూడలేక వైకాపా తీర్థం పుచ్చుకున్నారు

Date : 10 August 2025 06:07 PM Views : 670

Famous TV - ఆంధ్రప్రదేశ్ / చిత్తూరు : చౌడేపల్లి ఫేమస్ టీవి న్యూస్ : చిత్తూరు జిల్లా, చౌడేపల్లి మండలంలో ని ఆమినిగుంట గ్రామపంచాయితీ సింగిరిగుంట గ్రామమునకు చెందిన యం.ప్రకాష్ నాయుడు, పి.చెన్న కృష్ణ, డి.సుజాత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతామని గత రెండు మూడు రోజులుగా మాతో సంప్రదింపులు జరిపినారు.ఆదివారం తంబళ్లపల్లె శాసనసభ్యులు పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి తంబళ్లపల్లె పర్యటనకు వెళ్తున్న సమయంలో మా కోరిక మేరకు వారికి సింగిరిగుంట గ్రామంలో మా పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది.అదే సమయంలో పరికిదొన పంచాయతీకి చెందిన నాగరాజు నాయుడు, సింగిరిగుంటకు చెందిన నరేష్ నాయుడు, రాజశేఖర్ నాయుడులను మా కార్యక్రమానికి తీసుకువచ్చి మేము వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతామని మాకు కండువా వేసి ఆహ్వానించవలసినదిగా కోరినారు. మీరు ఎందుకు మా పార్టీ లో చేరుతున్నారని అడుగగా వారు ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా వారి దౌర్జన్యాలను, వారి డ్రామాలు చూడలేక వచ్చామని సమాధానం ఇచ్చారు.ఐతే ఈ ముగ్గురిని తెలుగుదేశం పార్టీ నాయకులు మా దగ్గరకు పంపించి డ్రామాలు ఆడించి కొద్ది గంటల సమయంలో తిరిగి పార్టీలోకి వచ్చినట్లు ప్రకటించుకున్నారు.మేము ఎవరిని మభ్య పెట్టవలసిన అవసరం లేదు వాళ్లేమి చిన్నపిల్లలు కాదు ఎవరిని బలవంత పెట్టి పార్టీలో చేసుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి అని వైకాపా మండలాధ్యక్షులు నాగభూణ రెడ్డి తెలియజేశారు..వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రజల మద్దతు రోజురోజుకు పెరుగుతుండడం గమనించి తెలుగుదేశం పార్టీ నాయకులు జీర్ణించుకోలేక మేము మోసం చేసినాము, మభ్యపెట్టినామని ఆవాకులు చేవాకులు పేలుస్తున్నారు. అలాంటి అవసరం మా పార్టీకి లేదని ఆయన తెలియజేస్తూ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Vuttaradi Hariprasad

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :