Famous TV - ఆంధ్రప్రదేశ్ / తిరుపతి : సోమవారం ఎస్ వి వైద్య కళాశాల ను రుయా ఆసుపత్రి ని సందర్శించి న డాక్టర్ నరసింహమ్,డైరెక్టర్ ఆఫ్ వైద్య విద్య సంచాలకులు. ఈ సందర్బంగా ఎస్వీ వైద్య కళాశాల అదనపు వైద్య విద్య సంచాలకులు మరియు ప్రిన్సిపాల్ డాక్టర్ చంద్రశేఖరన్ స్వాగతం పలుకుతూ ఎస్వీ వైద్య కళాశాల భువన విజయం ఆడిటోరియం నందు, చెవి ముక్కు మరియు నాలుక విభాగము,ప్రపంచ వినకడి దినం ముగింపు సమావేశాలు సందర్భంగా ఎగ్జిబిషన్ ని ప్రదర్శించడం జరిగింది. వినికిడి సమగ్రీలు, కరపత్రాలు, సందర్శనార్థం , అవగాహన కొరకు మొట్టమొదటిసారిగా ఎగ్జిబిషన్ చేయబడినది. దీన్ని ప్రారంభించిన వైద్య విద్య సంచాలకులు డాక్టర్ నరసింహమ్. తదుపరి సామాజిక వైద్య వైద్య విభాగం నందు ఆగస్టు నెలలో జరగబోవు ఇండియన్ పబ్లిక్ హెల్త్ అసోసియేషన్, మరియు ఇండియన్ సోషల్ ప్రివెంటివ్ మెడిసిన్, వారి మూడు రోజుల కాన్ఫరెన్స్ బ్రోచర్ను ప్రారంభించడం జరిగినది. తదుపరి ప్రిన్సిపాల్ సమావేశ మందిరంలో ఆగస్టు నెలలో జరగబోవు మెడికల్ ఎడ్యుకేషన్ స్టేట్ కాన్ఫరెన్స్ బ్రోచర్ ప్రారంభోత్సవం జరిగినది. తదుపరి వైద్య కళాశాల రుయా హాస్పిటల్ వైద్యులతో చర్చ సమావేశం నిర్వహించి ఆసుపత్రి, వైద్య కళాశాల అభివృద్ధికి అందరి యొక్క తోడ్పాటు అందించాలని, పేద రోగులకు మెరుగైన వైద్యం అందించడంలో ప్రతి ఒక్క వైద్యుల పాత్ర ఎంతైనా ముఖ్యమని వైద్య విద్య సంచాలకులు ఈ సందర్భంగా తెలిపారు . ఈ కార్యక్రమంలో ఎస్ వి వైద్య కళాశాల, రుయా ఆస్పత్రి వైద్యులు , వైద్య సిబ్బంది, పి జి.వైద్య విద్యార్థులు, మరియు ఎస్ వి వైద్య కళాశాల పిఆర్ఓ వీర కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
Admin
Famous TV