Famous TV - ఆంధ్రప్రదేశ్ / చిత్తూరు : చౌడేపల్లి ఫేమస్ టీవి న్యూస్ : చిత్తూరు జిల్లా, చౌడేపల్లి పెండింగ్ కేసులను సత్వరం పరిష్కారం చేయాలని పలమనేరు డీఎస్సీ ప్రభాకర్ ఆదేశంచారు. ఆయన బుధవారం చౌడేపల్లె సర్కిల్ కార్యాలయం లో డివిజనల్ స్థాయిలో క్రైమ్ సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిశీలించి న్యాయం చేయడానికి కృషి చేయాలన్నారు. పట్టణాల్లో ట్రాఫిక్ నియంత్రణకు తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఇటీవల కాలంలో చైన్ స్నాచింగ్, పట్టపగలే చోరీలు జరుగుతున్నాయని, ప్రత్యేక నిఘా పెట్టాలన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని కేసులను భేదించాలన్నారు. సైబర్ థైమ్, డ్రంక్ అండ్ డ్రైవ్ మహిళలపై జరుగుతున్న దాడుల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. స్టేషన్లో రికార్డులను ఎప్పటి కప్పుడు అప్డేట్ చేయాలన్నారు.. అనంతరం సర్కిల్ కార్యాలయాల వారిగా కేసుల పురోగతిపై సమీక్షించారు. సమావేశంలో సీఐలు రాంభూపాల్, సుబ్బరాయుడు, మురళీమోహన్, తదితరులు పాల్గొన్నారు.
Admin
Famous TV