Famous TV - ఆంధ్రప్రదేశ్ / చిత్తూరు : కూటమి ప్రభుత్వ హయాంలో రైతులకు అన్నదాత సుఖీభవతో పెట్టుబడి సాయం చౌడేపల్లి ఫేమస్ టీవి న్యూస్: చిత్తూరు జిల్లా, చౌడేపల్లి కూటమి ప్రభుత్వ హయాంలో రైతులకు అండగా ఉంటూ కూటమి ప్రభుత్వ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతుల పక్షపాతిగా ఇచ్చిన మాట ప్రకారం కేంద్ర ప్రభుత్వం అందించే పీఎం కిసాన్ తో కలిపి అన్నదాత సుఖీభవ పథకాన్ని లాంచనంగా ప్రధాని నరేంద్ర మోడీ వీడియో కాన్ఫరెన్స్ తో ముఖ్యమంత్రి వీక్షిస్తూ ప్రధాని విడుదల చేసిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్నదాత సుఖీభవ పథకానికి నాంది పలికిందని మండల వ్యవసాయ అధికారి మోహన్ అన్నారు. ఈ కార్యక్రమాన్ని వారు రైతు సేవా కేంద్రం 4 లో వీడియో కాన్ఫరెన్స్ వీక్షిస్తూ వచ్చిన కూటమి నాయకులకు అన్నదాత సుఖీభవ పథక ప్రారంభోత్సవాన్ని నిర్వహించారు. ఈ పథక ప్రారంభోత్సవ కార్యక్రమానికి తెదేపా మండలాధ్యక్షులు గువ్వల రమేష్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి బోయకొండ సుబ్బు, పూల చంద్రమౌళి మరియు కూటమి నాయకులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ప్రధాని మోడీ పీఎం కిసాన్ పథకాన్ని ప్రారంభించిన వెంటనే అందరూ చప్పట్లతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం వక్తలు మాట్లాడుతూ కూటమి హయాంలో రాష్ట్రంలో ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయని, ఇందులో భాగంగానే సూపర్ 6 లో భాగంగా ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు మరియు కూటమి ప్రభుత్వానికి ప్రజలు ఎంతో నమ్మకంగా రుణపడి ఉండాలని అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి చంద్రబాబు రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు నేడు అన్నదాత సుఖీభవ పథకాన్ని ఎంతో అట్టహాసంగా ప్రారంభించడం జరిగిందన్నారు. అలాగే మరిన్ని సంక్షేమ పథకాలను కూటమి ప్రభుత్వం ప్రవేశపెడుతుందని ప్రతి ఒక్కరూ కూటమి ప్రభుత్వానికి అండగా నిలవాలని అన్నారు. అన్నదాత సుఖీభవ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని మండలంలోని పెద్దకొండామర్రి, దిగువపల్లి, తదితర ప్రాంతాలలో కూడా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు ఆవుల పవన్,కుమార్ రెడ్డి, వెంకట్రమణ, మునివెంకటప్ప, శ్రీనివాసులు, బాల్ రెడ్డి, సుబాన్, చెంగల్రాయప్ప, అర్జున్ తదితర కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Admin
Famous TV