Famous TV - ఆంధ్రప్రదేశ్ / : బుధవారము ఎస్ వి వైద్య కళాశాల, రుయా ఆసుపత్రి, చిన్న పిల్లల విభాగంలో వైద్య అధికారులకు క్యాన్సర్ మీద మూడు రోజుల శిక్షణ కార్యక్రమాలను ప్రారంభించిన ఎస్ వి వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి ఏ చంద్రశేఖరన్. చిత్తూర్ జిల్లా వైద్య అధికారులకు క్యాన్సర్ మీద అవగాహన మరియు శిక్షణ కార్యక్రమాలు, ఎంతైనా అవసరం ఉందని రుయా ఆసుపత్రి సుపారీటెండెంట్ డాక్టర్ జి.రవి ప్రభు , ప్రభుత్వ వైద్యులను ఉద్దేశించి క్యాన్సర్ వ్యాధి మీద తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి, ఎప్పటికప్పుడు కొత్త విధానాలు తెలుసుకొనవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందని అన్నారు. ఇలాంటి ట్రైనింగ్ వలన, పేద రోగులకు మెరుగైన వైద్యం అందించడం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఈ సందర్భంగా వైద్యుల్ని ఉద్దేశించి ప్రసంగించారు. ఆంధ్రప్రదేశ్ ఆరోగ్యం మరియు కుటుంబ సంక్షేమ శాఖ ఆదేశాల మేరకు శిక్షణ కార్యక్రమాలు రుయా ఆసుపత్రి చిన్నపిల్లల విభాగం *మెట్టు హాలు * నందు నిర్వహించబడుచున్నది, అని ఎస్వీ వైద్య కళాశాల క్యాన్సర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ నోడల్ అధికారి డాక్టర్ వై వెంకట్ లక్ష్మి తెలిపారు. చిత్తూరు జిల్లాకు చెందిన DSH స్పెషలిస్ట్ వైద్యులు & NCD బృందానికి క్యాన్సర్ స్క్రీనింగ్ మరియు ముందస్తుగా గుర్తించడంపై NP-NCD- శిక్షణ. జూన్ నెల 05. 06.2024 నుండి 07.06.2024, మూడు రోజులు ఈ శిక్షణా కార్యక్రమం నిర్వహించబడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ వి వైద్య కళాశాల వైస్ ప్రిన్సిపాల్ పరిపాలన డాక్టర్ వెంకటేశ్వర్లు, డాక్టర్ రోజా రమణి, డాక్టర్ చండీప్రియ, డాక్టర్ సునీత, వైద్యులు వైద్యాధికారులు తదితరులు పాల్గొన్నారు.
Admin
Famous TV