Famous TV - ఆంధ్రప్రదేశ్ / చిత్తూరు : పలమనేరు ఫేమస్ టీవి న్యూస్ : చిత్తూరు జిల్లా,పలమనేరు మండలం లోని మొసలి మడుగు గ్రామ సమీపంలో ఆదివారం రాత్రి అడవిలో నుంచి వచ్చిన గుంపు ఏనుగులు గ్రామానికి చెందిన ఉమాపతి నాయుడు అనే రైతుకు చెందిన కోత దశలో ఉన్న ఐదు ఎకరాల మామిడి తోటలోనికి ప్రవేశించి కోత దశలో ఉన్న నాలుగు ఎకరాల్లో మామిడి కొమ్మలను విరిచేసి అందులోని కాయలను ఆరగించి మిగిలిన కాయలను నేలపాలు చేసి కాళ్ళతో తొక్కి పూర్తిగా నష్టపరచడమే కాకుండా ఎండకు వర్షానికి దాపుగా వేసుకున్న చిన్న గుడిసెను కూడా ధ్వంసం చేశాయి. ఈ నష్టమైన నాలుగు ఎకరాల మామిడి తోట సుమారు మూడు లక్షల రూపాయలు నష్టం జరిగిందని రైతు ఆవేదనతో వాపోయారు. అదేవిధంగా పక్కనున్న రైతు గిరిజ అనే రైతు పొలంలో వేసిన వారి మడిని తొక్కి అక్కడున్న కొబ్బరి చెట్లను విరిచేసి నష్టపరిచాయి ఈ విషయాన్ని అటవి శాఖ అధికారులకు తెలిసిన వెంటనే అక్కడికి చేరుకున్న ఫారెస్ట్ రమేష్ మరియు బీట్ ఆఫీసర్ యుగంధర్ తదితరులు వచ్చి ఏనుగుల వలన నష్టమైన మామిడి ఇతర తోటను పరిశీలించి రైతులకు నష్టమైన పంటలను ప్రభుత్వానికి పంపి ప్రభుత్వం ద్వారా రైతులకు తగిన నష్టపరిహారం తప్పక ఇప్పిస్తామని రైతులకు సర్ది చెప్పి పంచనామా పత్రాన్ని రైతులకు అందజేశారు. రైతులు పంటపెట్టుబడులకు లక్షలాది రూపాయలు అప్పులు చేసి వేసిన పంటలు చేతికొచ్చే సమయంలో ప్రతి యేటా ఏనుగుల వలన వేసిన పంటలు పూర్తిగా నష్ట పోతూనే ఉన్నాయి ఈ మద్య కాలంలో ఏనుగులు రాలేదు కానీ ప్రస్తుతం మామిడి సీజన్ కాబట్టి ఇప్పుడు మళ్ళీ మొదలైనాయి గత వారం రోజులుగా ఏదో ఒక చోట నష్టం చేస్తున్నాయి అటవి శాఖ అధికారులు వారి సిబ్బంది కూడా ప్రతి నిత్యం పొలాల వద్ద ఉంటున్నా కూడా మరోవైపున వస్తున్నాయి.రాత్రి కూడా ఇందిరానగర్ వైపు వస్తాయని అక్కడ నిఘా ఉన్నారు. కానీ మరోవైపు నుంచి వచ్చిన ఏనుగులను గమనించ లేకపోయారు కానీ మామిడి కోతల సీజన్లో రాత్రికి కూడా ఏనుగులు మళ్ళీ వచ్చి నష్ట పరుస్తాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకపై ఏనుగులు పంటపొలాలపై రాకుండా వాటిని అదుపు చేసి అడవికి ఆనుకుని వున్న ప్రాంతాల్లో సోలార్ ఫెన్సింగ్ వెంటనే ఏర్పాటు చేపట్టాలని రైతులు కోరుతున్నారు.
Admin
Famous TV