Famous TV - ఆంధ్రప్రదేశ్ / చిత్తూరు : చౌడేపల్లి ఫేమస్ టీవి న్యూస్ : రాష్ట్రంలో ఉన్న మొత్తం 17 మెడికల్ కాలేజీ లను గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డిగారు అప్పటి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి ప్రస్తుత ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి కృషి తో రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేశారు,వీటితో పాటు ఇప్పటికే ప్రారంభమైన కళాశాలలో 750 మంది విద్యార్థులు అడ్మిషన్ లో ఉన్నారు. అంతేకాకుండా 2024 ఎన్నికల ముందు విజయనగరం,పులివెందులలో మెడికల్ కళాశాలలు ప్రారంభం అయ్యాయి. మరి ఈరోజు నేటి కుటమి ప్రభుత్వం మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ చేయటం ఎంత వరకు సమంజసం అని రాష్ట్ర విద్యార్థి విభాగ సంయుక్త కార్యదర్శి కళ్యాణ్ భరత్ అన్నారు. రాష్ట్ర విద్యార్థి విభాగం తరఫున ప్రైవేటీకరణ విధానాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.పేద విద్యార్థులు జీవితాల్లో వెలుగు నింపాలని అప్పటి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సంకల్పాన్ని నెరవేర్చిన ఘనత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దే అన్నారు. అదేవిధంగా పుంగనూరు శాసనసభ్యులు,మాజీ మంత్రి వర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట పార్లమెంట్ సభ్యులు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి కృషితో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో భాగం అయినటువంటి మదనపల్లిలో మెడికల్ కళాశాలను ఏర్పాటు చేశారుఅని కొనియాడారు,దాని నిర్మాణ పనులను నిలుపుదల చేసిసన ఘనత కూటమి ప్రభుత్వానిదే అన్నారు.ఈ కార్యక్రమంలో నాగేంద్ర,షేర్ ఖాన్ ,చాన్ బాషా తదితరులు పాల్గొన్నారు.
Admin
Famous TV