Famous TV - ఆంధ్రప్రదేశ్ / : ఎస్వీ వైద్య కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ బయో కెమిస్ట్రీ విభాగం లెక్చరర్ గ్యాలరీలో డాక్టర్ ఏ వి ఎస్ ఎస్ రామారావు 99వ జన్మదిన సందర్భంగా ఎస్. వి వైద్య కళాశాలలో బయో కెమిస్ట్రీ విభాగం నందు అత్యధిక మార్కులు సాధించిన వైద్య విద్యార్థికి డాక్టర్ ఏవీఎస్ రామారావు మెమోరియల్ వారు ఇక ప్రతి సంవత్సరము బయో కెమిస్ట్రీ విభాగంలో అత్యధిక మార్కులు సాధించిన వారికి గోల్డ్ మెడల్ లు, నగదు బహుకరిస్తూ విద్యార్థులకు ప్రోత్సాహాలు అందించడం జరుగుతుందని, ముఖ్యఅతిథిగా విచ్చేసిన డాక్టర్ ఎం శ్రీనివాసులు, రిటైర్డ్ ప్రొఫెసర్ చర్మవ్యాధి నిపుణులు, పిల్లలను ఉద్దేశించి వైద్య విద్యలో పోటీపడి చదువుకోవాలని ఇలాంటి ప్రతీ డిపార్ట్మెంట్లో మంచి ప్రోత్సాహాలు అందుకుని పేద రోగులకు మెరుగైన వైద్యం అందించినట్లయితే సమాజంలో గొప్ప వైద్యులుగా మెలగవచ్చునని వైద్య విద్యార్థులు ఉద్దేశించి ప్రసంగించారు. ఎస్ వి వైద్య కళాశాలో 2021- 2022వ సంవత్సరం బయో కెమిస్ట్రీ విభాగంలో అత్యధిక మార్కులు సాధించిన కుమారి. సాయి దీపిక అనే వైద్య విద్యార్థినికి నగదు రూపాయలు 10,000 /-, గోల్డ్ మెడలు ఇచ్చి సత్కరించడం జరిగినది. 2024వ, సంవత్సరంలో 100 సంవత్సరాలు డాక్టర్ ఏ వి ఎస్ ఎస్ రామారావు పూర్తి అగు సందర్భంలో బయో కెమిస్ట్రీ విభాగమునకు, వైద్య విద్యార్థులకు చాలా విలువైన వసతులు కల్పించడానికి ప్రణాళికను చేసుకుంటున్నట్లు కుటుంబ సభ్యులు ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన అదనపు వైద్య విద్య సంచాలకులు మరియు ప్రిన్సిపల్ డాక్టర్ చంద్రశేఖరన్ , ఇలాగ దాతలు ముందుకు వచ్చినట్లయితే మనము ప్రభుత్వ వైద్య కళాశాలను అభివృద్ధి పథంలో నడపడానికి ఎంతో దోహదపడుతుందని , వైద్య విద్యార్థులలు, వైద్యం అభ్యసించేటప్పుడు పోటీపడి చదివే తత్వాన్ని అవలంబించుకొని మెరుగైన వైద్య విద్యను నేర్చుకొని, వైద్య, పరిశోధనలో ముందడుగు వేస్తూ , వైద్య కళాశాలకు ప్రభుత్వానికి ఎనలేని సేవలు అందించాలని తెలిపారు. అంతర్జాతీయ స్థాయిలో మంచి వైద్యులుగా మెలగాలని ఈ సందర్భంగా ఆయన అన్నారు. ఈ కార్యక్రమానికి ఎస్వీ వైద్య కళాశాల వైస్ ప్రిన్సిపాల్ (అకాడమిక్) డాక్టర్ సునీత, బయో కెమిస్ట్రీ విభాగాధిపతి డాక్టర్ మాధవి లత, బయో కెమిస్ట్రీ విభాగ వైద్యులు, సిబ్బంది మరియు ఎస్ వి వైద్య కళాశాల పి ఆర్ ఓ వీర కిరణ్ పాల్గొన్నారు.
Admin
Famous TV