Famous TV - ఆంధ్రప్రదేశ్ / తిరుపతి : శ్రీవేంకటేశ్వర ప్రాచ్య పరిశోధన సంస్థలో స్వర్గీయ వేటూరి ప్రభాకర శాస్త్రి వర్థంతి , గిడుగు రామమూర్తి జయంతి (తెలుగు భాషా దినోత్సవం)సందర్భంగా సంస్థ ఉద్యోగులు,పరిశోధకులు, సంచాలకులు డా॥ పి సి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. వారి ఛాయా చిత్రాలకు పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ సమావేశంలో వేటూరి ప్రభాకర శాస్త్రి సంస్థలో రీడరుగా పనిచేసే రోజుల్లో అన్నమయ్య సంకీర్తనలు వెలుగు చూశాయని,శాసనశోధకుడిగా, గ్రంథ పరిష్కర్తగా వారి సేవలు ఓ ఆర్ ఐ మరచి పోలేదని అన్నారు. గిడుగు వీరి జీవితార్పణ వల్లనే నేడు వ్యావహారిక భాష అందరికీ అందిందని మన మాతృభాష మాధుర్యం అర్థమైందని అన్నారు. ఈ సమావేశానికి డా॥ రాజశేఖర్, డా॥ వెంకటేశ్, డా॥ విజయ్ కుమార్ రెడ్డి, చంద్రశేఖర్ , పరిశోధకులు పాల్గొన్నారు.
Admin
Famous TV