Famous TV - ఆంధ్రప్రదేశ్ / గుంటూరు : ఆఖరి మజిలీ కి చోటు ఏది తాడేపల్లి సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి ఉండే ప్రాంతం అలాంటి తాడేపల్లి లో ఇంత వరకు హిందూ స్మశాన వాటిక లేదు ఎవరైనా మృతి చెందితే రోడ్డు ప్రక్కన దహన సంస్కారాలు నిర్వహించుకోవాల్సి వస్తుంది ఆ రోడ్డు మార్గం లో ప్రయాణించే వారు తీవ్ర అసౌకర్యానికి గురి అవుతున్నారు స్కూల్ నుంచి వెళ్లే చిన్నారులు మృతదేహం ఖననం చేసే సమయం లో చూసి భయపడుతున్నారు దాదాపు లక్ష జనాభా ఉండే తాడేపల్లి కి ఆఖరి మజిలీ లేదు బంకింగ్ హోమ్ కెనాల్ కట్ట పై ఉన్న స్మశాన వాటికలో కేవలం క్రిష్టియన్లు,హిందువులు కొన్ని వర్గాల వారు పూడ్చడానికి వీలు ఉంది కానీ దహన సంస్కారాలు నిర్వహించుకోవడానికి అవకాశం లేదు సంప్రదాయం ప్రకారం దహన సంస్కారాలు నిర్వహించుకునే వారికి రోడ్డు ప్రక్కనే చేయాల్సిన దుస్థితి ఏర్పంది మంగళగిరి తాడేపల్లి కలిపి నగరపాలక సంస్థ గా ఏర్పాటు అయిన తాడేపల్లి ప్రజలకు దురవస్థ తప్పడం లేదు ఎడతెరిపి లేకుండా వర్షం వేస్తే చితి మంటలు అరిపోతున్నాయి అని దహన సంస్కారాలు నిర్వహించే ఉయ్యాల అంజయ్య తెలిపారు ఇక్కడ కాకపోతే విజయవాడ లోని స్వర్గపురి కి తీసుకెళ్ళాసి రావడం భారం గా మారుతుంది అని అన్నారు లక్ష మంది జనాభా ఉన్న కార్పొరేషన్ అయిన సరే 8 దశాబ్దాలుగా స్మశానం వాటిక లేక రోడ్డు పోరంబోకు స్థలం లో దహన సంస్కారాలు చేసుకుంటున్నాం అని మాకు స్మశానం కేటాయించాలని తాడేపల్లి ప్రజలు కోరుతున్నారు
Admin
Famous TV