Famous TV - ఆంధ్రప్రదేశ్ / : తిరుపతి, డిసెంబర్ 20, 2023 : వివిధ పారిశ్రామిక రంగాలలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న 1.75 బిలియన్ డాలర్ల బహుళ జాతి సంస్థ అమర రాజా గ్రూప్, తమ 38వ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఘనంగా మరియు ఉత్సాహంగా నిర్వహించారు. 1985లో అమర రాజా పవర్ సిస్టమ్స్గా కార్యకలాపాలను ప్రారంభించిన గ్రూప్ ఇప్పుడు 6 కంపెనీలు, 17 వ్యాపారాలు మరియు 16,000+ ఉద్యోగుల సంఖ్యతో అభివృద్ధి చెందింది. ఫౌండేషన్ డే వేడుకలో భాగంగా, గ్రూప్ మెరుగైన అవకాశాలకు మెరుగైన ప్రాప్యతను అందించే వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లడానికి అమర రాజా బెటర్ వే అవార్డుల విజేతలను ప్రకటించింది. ఈ కార్యక్రమంలో, ముగ్గురు గ్రామీణ పారిశ్రామికవేత్తలను ఎంపిక చేసి, వారికి రూ. 3 లక్షల నగదు బహుమతి మరియు అమర రాజా కు చెందిన మార్కెటింగ్, హెచ్ఆర్, ఫైనాన్స్ మరియు సప్లై చెయిన్ CXO లతో ఒక సంవత్సరం పాటు మెంటర్షిప్ అందించారు. తిరుపతి రోడ్లను సురక్షితంగా మార్చే లక్ష్యంతో, ఈ గ్రూప్ తమ రోడ్ సేఫ్టీ అవేర్నెస్ డ్రైవ్ను కూడా ప్రకటించింది. ఈ కార్యక్రమంలో 38 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణంలో అమర రాజాకు మద్దతుగా నిలిచిన సంఘం నాయకులను సన్మానించారు మరియు అమర రాజా లో 25 సంవత్సరాలు పైగా పనిచేస్తున్న135 మంది ఉద్యోగులకి లాంగ్ సర్వీస్ అవార్డ్స్ అందించారు. భారతదేశపు తొలి మహిళా IPS అధికారి డా. కిరణ్ బేడీ తన స్ఫూర్తిదాయకమైన జీవిత ప్రయాణం గురించి మాట్లాడుతూ ఉద్యోగులను చైతన్యపరిచారు. కేరళకు చెందిన ఒక బృందం ప్రసిద్ధ యుద్ధ కళల రూపం - కలరి పయట్టు - గొప్ప సంప్రదాయాన్ని మరియు కళ యొక్క 3,000 సంవత్సరాల చరిత్రను ప్రదర్శించింది. ఈసందర్భంగా అమర రాజా గ్రూప్ చైర్మన్ జయదేవ్ గల్లా మాట్లాడుతూ “మా వ్యాపారాలన్నింటి కోసం అపార అవకాశాలను కలిగి ఉన్న నూతన భవిష్యత్తులోకి అడుగుపెడుతున్నప్పుడు, మా ప్రయాణంలో ప్రతి అడుగులో ఎల్లప్పుడూ ముందుంటామని మేము విశ్వసిస్తున్నాము. గత 38 సంవత్సరాలలో, మేము నిర్వహిస్తున్న పరిశ్రమలను పునర్నిర్వచించాము మరియు గొప్ప విజయాలతో ముందుకు సాగగలమని గట్టిగా నమ్ముతున్నాము” అని అన్నారు. ఈ వేడుకలకు అమర రాజా వ్యవస్థాపక చైర్మన్ డా. రామచంద్ర నాయుడు గల్లా, గల్లా అరుణ కుమారి, డాక్టర్ రమాదేవి గౌరినేని, హర్షవర్ధన్ గౌరినేని, విక్రమాదిత్య గౌరినేని, సిద్ధార్థ్ గల్లా మరియు అశోక్ గల్లా మరియు అమర రాజా అగ్ర నాయకత్వం, ఉద్యోగులు పాల్గొన్నారు మరియు చివరగా కేరళా వారిచే సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.
Admin
Famous TV