Famous TV - ఆంధ్రప్రదేశ్ / తిరుపతి : తిరుపతి ఎం.పి డాక్టర్ గురుమూర్తి రానున్న ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే అంశం పై అనవసర ఊహాగానాలకు తెరదించాలని వై.సి.పి దక్షిణ కోస్తా జిల్లాల సమాన్వయకర్త విజయసాయి రెడ్డి కోరారు. తిరుపతి జిల్లా పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల వైసిపి నాయకులతో రెండు రోజుల పాటు విజయసాయి రెడ్డి నేతృత్వంలో సమీక్ష సమావేశాలు జరిగాయి. ఈ సమావేశాల్లో తిరుపతి ఎంపి గురుమూర్తి పోటీ పై అసక్తికర వ్యాఖ్యలు చేసినట్టు సమాచారం. రానున్న ఎన్నికల్లో తిరుపతి ఎంపి గా డాక్టర్ గురుమూర్తి పోటీ చేయరనే ప్రచారాన్ని ఆయన కొట్టి పారేసారు. తిరుపతి లోకసభ నియోజకవర్గ పరిధిలో మూడు ఎస్సీ రేజర్వ్డ్ స్థానాల్లో ఎదో ఒక చోట నుంచి డాక్టర్ గురుమూర్తి పోటీ చేస్తారనే ప్రచారం తన దృష్టికి వచ్చిందని విజయసాయి రెడ్డి అన్నట్టు సమాచారం.అయితే ఆ ప్రచారంలో ఎంత మాత్రం నిజం లేదన్నారు. అలాంటి ఊహాగానాలకు తెరదించాలని ఆయన కోరారు.
ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో నమ్మకంతో అత్యున్నత చట్ట సభకు గురుమూర్తిని పంపారని. ముఖ్యమంత్రి నమ్మకాన్ని గురుమూర్తి వమ్ము చేయలేదన్నారు. తనకు అప్పగించిన బాధ్యతలను గురుమూర్తి విజయవంతంగా నిర్వర్తిస్తూ,మంచి పార్లమెంటేరియన్ గా పేరు తెచ్చుకున్నారని కితాబిచ్చారు. తిరుపతి ఎంపి గా గురుమూర్తినే పోటీ చేయించాలనేదే తన అభిమతమన్నారు.
ఇదే విషయాన్ని సిఎం దృష్టికి తీసుకెళ్లి,మళ్ళీ తిరుపతి లోకసభ బరిలో డాక్టర్ గురుమూర్తినే నిలిపేలా చేస్తామని ఆయన అన్నారు. కావున గురుమూర్తి ఎంఎల్ఏ గా పోటీ చేస్తారనే ప్రచారాన్ని పక్కన పెట్టి ఆయన్ను మరోసారి ఎంపి గా చూసేందుకు అందరూ కృషి చేయాలని విజయసాయి రెడ్డి అన్నారు
Reporter
Famous TV