Sunday, 26 July 2026 07:40:38 AM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

చిత్తూరు జిల్లాలోని హోం గార్డ్ లకు దర్బార్ నిర్వహించిన అడిషనల్ ఎస్పీ ఏ.ఆర్. శ్రీ జె.నాగేశ్వర రావు.

Date : 28 July 2023 05:03 PM Views : 532

Famous TV - ఆంధ్రప్రదేశ్ / చిత్తూరు : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ డి.జి.పి. శ్రీ కె.వి.రాజేంద్రనాథ్ రెడ్డి, IPS గారు మరియు జిల్లా ఎస్పీ శ్రీ వై.రిశాంత్ రెడ్డి, IPS గారి ఆదేశాల మేరకు చిత్తూరు ఆర్మ్డ్ రిజర్వు ఆఫీస్ నందు గల పెరేడ్ గ్రౌండ్ నందు సిబ్బంది సమస్యలను పరిష్కరించడం లక్ష్యంగా "దర్బార్" కార్యక్రమాన్ని నిర్వహించిన అడిషనల్ ఎస్పీ ఏ.ఆర్. శ్రీ జె.నాగేశ్వర రావు గారు. మీ ఆరోగ్యం బాగుంటునే మీ కుటుంబం కూడా బాగుంటుందని గుర్తుంచుకోవాలి. సిబ్బంది ఆరోగ్య విషయాలలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్యపరమైనటువంటి ఏదైనా విషయాలు కనిపించిన వెంటనే జిల్లా పోలీస్ ఆరోగ్య కేంద్రం సేవలను వినియోగించుకోవాలని, అందరు క్రమశిక్షణతో ఉంటూ, శారీరిక దారుఢ్యం కలిగి ఉండి, ఎటువంటి విపత్తులను ఎదుర్కునేందుకైన సంసిద్ధంగా ఉండాలి. సిబ్బందికి ఉద్యోగ బాధ్యతలతో పాటు వారి సంక్షేమం కోసం అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. మీ సంక్షేమం కోసం తక్కువ ధరలతో అన్ని సదుపాయాలతో ఏర్పాటు చేసిన పోలీస్ వెల్ఫేర్ క్యాంటీన్ ను కుటుంబ సమేతంగా వెళ్ళి వినియోగించుకోవాలని సూచన. పోలీసు శాఖ ప్రభుత్వం యొక్క ముఖ చిత్రం.. ఫిర్యాదుదారులతో మర్యాదగా, ఓపికగా వ్యవహరించాలి. పరుషంగా మాట్లాడవద్దు. మహిళలు, చిన్నపిల్లలు, వృద్దులు, అణగారిన వర్గాల ఫిర్యదులలో తక్షణం స్పందించాలని ఆదేశించారు. చట్టాలను తెలుసుకోవాలని సూచించి, విధులలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తే సహించేది లేదని హెచ్చరికలు జారి చేసారు. అనంతరం అధికారులు, సిబ్బందితో ముఖాముఖిగా మాట్లాడి వారి విధుల్లో మరియు ఆరోగ్య, విద్య, తదితర అంశాలలో ఉన్న సమస్యలను అడిగి తెలుసుకుని పరిష్కారం చేసే దిశగా చర్యలు చేపట్టాలని సంబంధిత పోలీసు అధికారులను ఆదేశించారు. దర్బార్ పెరేడ్ అనంతరం 30 సం.ల పాటు పోలీస్ డిపార్టుమెంటు కు తన సుధిర్ఘమైన సేవలు అందించి ఈరోజు పదవీ విరమణ పొందిన శ్రీ రవీంద్రనాథ్ దేశాయ్, HG 08 గారిని హోం గార్డ్స్, మరియు వారి కుటుంబం ముఖాన అడిషనల్ ఎస్పీ గారు ఘనంగా సన్మానించారు. పోలీస్ డిపార్టుమెంటు తరపున వారి కుటుంబానికి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమం కు ఏ.ఆర్. డి.ఎస్పీ శ్రీ మురళీధర్, RI అడ్మిన్ శ్రీ నీలకంటేశ్వర రెడ్డి తదితరులు హాజరు కావడమయినది

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :