Famous TV - ఆంధ్రప్రదేశ్ / తిరుపతి : తిరుపతి లో తరతరాల రాజకీయ నేపథ్యం కలిగిన కుటుంబం నుంచి వచ్చిన నవీన్ తిరుపతి నియోజకవర్గ పరిధిలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని గుర్తింపును ప్రజల మన్ననలను సంపాదించుకున్నారు టీటీడీ లో జరుగుతున్న నిధుల దుర్వినియోగంపై, భక్తులకు కలుగుతున్న అసౌకర్యాలపై శ్రీవారి భక్తినిగా స్థానికునిగా నిరంతరం ప్రశ్నిస్తూ శ్రీవారి నిధులను సంరక్షిస్తూ అలాగే తిరుపతి నగర ప్రజలు ఎదుర్కొంటున్న అనేక ప్రజా సమస్యలపై నిరంతరం రాజీలేని పోరాటం చేస్తున్న సీనియర్ కాంగ్రెస్ నేత ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి,ప్రస్తుత రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి శ్రీ నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారి సమక్షంలో బిజెపి నేషనల్ జాయింట్ జనరల్ సెక్రటరీ (ఆర్గనైజేషన్) మరియు ఏపీ పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ శ్రీ శివప్రకాష్ జీ గారు బిజెపి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సుదీర్ఘ రాజకీయ నేపథ్యం కలిగిన కుటుంబం నుంచి నవీన్ బిజెపి కుటుంబ సభ్యునిగా రావడం చాలా సంతోషదాయకం అన్నారు, వీరితోపాటు రాష్ట్ర సంఘటిత మంత్రి శ్రీ మధుకర్ జి, శ్రీ మోహన్ గారు బెంగళూరు సెంట్రల్ నియోజకవర్గ సిట్టింగ్ MP, శ్రీ, సిద్దరాజు గారు పార్లమెంట్ ఇన్చార్జి,అన్నమయ్య జిల్లా బిజెపి అధ్యక్షులు సాయి లోకేష్ రాష్ట్ర బిజెపి నాయకులు కోలా ఆనంద్, భాను ప్రకాష్ రెడ్డి,నాగోతు రమేష్ నాయుడు తదితరులు అభినందనలు తెలిపారు! ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి శ్రీ నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ తిరుమల శ్రీవారికి భక్తునిగా టీటీడీలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై ప్రతినిత్యం ప్రశ్నిస్తూ వెంకన్న సంపదను సంరక్షిస్తూ నిరంతరం శ్రీవారికి సేవ చేస్తున్న నవీన్ బిజెపిలో చేరడం అభినందనీయమన్నారు! నవీన్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి ప్రభుత్వం రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావాలని దేశం కోసం ధర్మం కోసం అనే నినాదంతో భారత దేశ ప్రగతిని ప్రపంచ దేశాలలో గర్వంగా చెప్పుకునేలా 3 వ స్థానానికి ఎదగాలన్న ఆకాంక్షతో,కుల మతాలకు ప్రాంతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజల సంక్షేమాన్ని అభివృద్ధిని ఆకాంక్షిస్తూ బిజెపిలో చేరడం జరిగిందన్నారు! ఏపీలో 5 కోట్ల మంది ప్రజల తలరాతలు మారాలంటే ఎన్ డి ఏ కూటమి కచ్చితంగా అధికారంలోకి రావాల్సిన సమయం ఆసన్నమైందన్నారు! ఏపీ లోని అధికార పార్టీ నాయకుల అరాచకాలకు, అవినీతికి అడ్డు అదుపు లేకుండా పోయిందని ప్రజాధనాన్ని ప్రకృతి సంపదను కొల్లగొడుతున్నారని రాబోయే ఎన్నికలలో ప్రజలంతా కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో బిజెపి "హ్యాట్రిక్" ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నదని అలాగే ఏపీలో బిజెపి టిడిపి జనసేన కూటమిని అఖండ మెజారిటీతో గెలిపించేందుకు అన్ని వర్గాల ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. కేంద్ర బిజెపి సీనియర్ నాయకులు శివ ప్రకాష్ జి కి నవీన్ శ్రీవారి చిత్రపటాన్ని ప్రసాదాలను అందించి శాలువతో సత్కరించారు బిజెపి అధిష్టానం ఆదేశాల మేరకు కుల మతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలతో మమేకమై పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని నవీన్ కుమార్ రెడ్డి తెలిపారు
Admin
Famous TV