Famous TV - ఆంధ్రప్రదేశ్ / : బనగానపల్లె మండలం గోవింద్ దీన్నే ప్రాథమిక పాఠశాల యందుశ్రీ జే కే ఆర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు శ్రీ జె ఎస్ ఎస్ బ్రహ్మానందచారి ఆధ్వర్యంలో పొద్దుటూరు పట్టణానికి చెందిన మనం ఫౌండేషన్ అధ్యక్షుడు లాయర్ చక్రవర్తి గారి సహకారంతో పాఠశాల విద్యార్థులకు పలకలు నోటి పుస్తకాలు పెన్నులు పంపిణీ ప్లాస్టిక్ వాడటం వలన కలుగు నష్టాలుపర్యావరణ పరిరక్షణకలుగు లాభాలు విద్యా విశిష్టతపై సదస్సు ఏర్పాటు చేయడం జరిగినది ముందుగా సదస్సును ఉద్దేశించి బ్రహ్మాండచారి మాట్లాడుతూ ప్లాస్టిక్ వాడటం వలన మానవులకే కాదు సమస్త జీవరాశులకు కూడాఎంతో నష్టమని తెలిపారు.ప్లాస్టిక్ వాడటం వలన కలుగు నష్టాల్ని వివరించారు పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి విద్యావంతుడు 10 చెట్లను నాటి వాటిని సంరక్షించాలని కోరారు.పాఠశాల హెచ్ఎంజి యాస్మిన్ మాట్లాడుతూ మా పాఠశాల విద్యార్థులకు పలకలు నోటు పుస్తకాలు పెన్నులు పంపిణీ చేసిన మనం ఫౌండేషన్ అధ్యక్షుడు చక్రవర్తికి కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుడు పీవీ నాగరాజు,సచివాలయ ఉద్యోగి సురేష్విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు మాట్లాడినారు.అనంతరం పాఠశాల విద్యార్థులకు పలకలు నోటు పుస్తకాలు పెన్నులు పంపిణీ చేశారు.
Admin
Famous TV