Famous TV - ఆంధ్రప్రదేశ్ / తిరుపతి : వ్యాపారవేత్తలు సామాజిక బాధ్యతను అలవర్చుకోవాలని ఆకాశవాణి తిరుపతి కేంద్రం మాజీ సంచాలకులు ఆకుల మల్లేశ్వరరావు పేర్కొన్నారు. తిరుపతి చాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో అన్నమయ్య సర్కిల్ సమీపంలోని కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన 77 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. అంతకు ముందు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, జెండా వందనం చేశారు. ఈ సందర్భంగా మల్లేశ్వరరావు మాట్లాడుతూ.. మన దేశ స్వాతంత్ర సమపర్రుల కోసం ఎంతోమంది ప్రాణ త్యాగం చేశారని గుర్తు చేశారు. స్వాతంత్ర్య ఉద్యమ స్ఫూర్తితో వ్యాపారవేత్తలు సామాజిక సేవలో పాల్గొనడం ద్వారా దేశాభివృద్ధికి తోడ్పాటు అందించాలని కోరారు. తిరుపతి చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు మోహన్ కుమార్ రాజు మాట్లాడుతూ.. తిరుపతి చాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో స్వచ్ఛందంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు ఎందుకు నగరంలోని అన్ని రంగాల వ్యాపారవేత్తలు సహకరిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో తిరుపతి చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు మోహన్ కుమార్ రాజు, కార్యదర్శి వాసుదేవన్, కోశాధికారి అయ్యప్ప, మాజీ అధ్యక్షులు మంజునాథ్, వాకా ప్రసాద్, ప్రముఖ వ్యాపారవేత్తలు పాల్గొన్నారు.
Admin
Famous TV