Famous TV - ఆంధ్రప్రదేశ్ / తిరుపతి : పంచాయతీ కార్మికులపై వివక్షత చూపుతున్న కార్యదర్శి సర్పంచ్ రేణిగుంట గ్రామ పంచాయతీ కార్మికులు పండగపూట జీతాలు ఇవ్వడం లేదని.సర్పంచ్ ను కార్యదర్శి. డిపిఓ రాజశేఖర్ రెడ్డి గారిని శాసన సభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి గారిని కలిసి గోడు విన్నవించుకొన్నా ఫలితం లేకుండా పోయింది.ఎమ్ ఎల్ ఏ ఆదేశించినా కార్యదర్శి గాని సర్పంచ్ గాని లెక్కలేకుండా వ్యవహరించడం చాలా బాధాకరమని.గత్యంతరం లేని పరిస్థితులలో రేణిగుంట అంబేత్కర్ విగ్రహం వద్ద ఆందోళన నిర్వహించినట్లు ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కేతారి రాధాకృష్ణ అన్నారు ఈ ఆందోళనా కార్యక్రమంకు మద్దతుగా సీపీఐ తిరుపతి జిల్లా కార్యదర్శి.పి.మురళి.రాయచోటి జిల్లా కార్యదర్శి పి ఎల్ నరసింహులు.ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కె రాధాకృష్ణ. నియోజకవర్గ కార్యదర్శి. వై యెస్ మణి .గ్రామ ఉపసర్పంచ్ ఇర్ఫాన్ వైఎస్ఆర్సిపి టౌన్ ప్రెసిడెంట్ ప్రభాకర్----మద్దతుగా నిలిచారు ఈ సందర్భంగా నాయకులు మురళి..రాధాకృష్ణ లు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ప్రజలు కార్మికులు పండగ జరుపు కొంటున్నారు కొంత మంది ఉద్యోగులు కు బోనస్ ఇస్తున్నారు కానీ ఈ రేణిగుంట పంచాయతీ వర్కర్స్ కు మాత్రం పండగపూట పస్తులు జీతం ఇవ్వలేదు అధికారులు ను ఎమ్ ఎల్ ఏ సర్పంచ్ ను కలిసి ప్రాధేయపడినా ఎమ్ ఎల్ ఏ ఆదేశించినా కార్యదర్శి సర్పంచ్ లెక్కలేకుండా వ్యవహరించడం చాలా దుర్మార్గం.కార్యదర్శి ఇయితే మరీ లెక్కలేకుండా ప్రవర్తించారని.ఇది చాలా కామన్ నాలుగు ఐదు నెలలకు ఒక సారికుడా జీతాలు ఇస్తారు కార్మికులు ఇలా ఇబ్భంది పెట్టారదని కార్మికులను బెదిరించడం .పంచాయతీ సర్పంచ్ కార్యదర్శి 200 బాక్సులు టపాసులు మరియు స్వీట్ బాక్స్ లు పంచాయతీ సిబ్బంది కి మరియు వార్డు సభ్యులకు పండుగ కానుకలు ఇచ్చారు తప్ప పంచాయతీ కార్మికులకు ఇవ్వకుండా వివక్షత చూపారని. ఆయన మాత్రం జీతాలు తీసుకొని పండగపూట కడప లో తన కుటుంబంతో సంతోషం గా పండగ జరుపుకోవడం ..స్థానికంగా కాపురం లేకుండా ఇంత పెద్ద పంచాయతీ ని కార్యక్రమాలను ఎలా నిర్వహిస్తారని ఇంత భాధ్యతారహితంగా ఉన్న వ్యక్తి ని ఇక్కడ విధులు నిర్వహించడం సాధ్యం కాదని.ఉప సర్పంచ్ కున్న భాద్యత వీరికి లేకుండా పోయిందని ఉప సర్పంచ్ ఈ రోజు సాయంత్రం లోపు కార్మికులందరికి రెండు లేదా మూడు వేలు అడ్వాన్స్ ఇస్తానని హామీ ఇచ్చారు దీనితో కార్మికులు కాస్తా సంతోషంగా ఆందోళన విరమించి విధులకు వెళ్లారు ఈ కార్యక్రమం లో ఏఐటీయూసీ శ్రీకాళహస్తి నియోజకవర్గం ప్రధాన కార్యదర్శి వై యెస్ మణి. మండల అధ్యక్ష కార్యదర్సలు రజాక్. కార్తీక్ .నాయకులు సెల్వ. పంచాయతీ కార్మిక నాయకులు .చంద్రకళ. సుబ్బరాజు శీను వెంకటమ్మ గోవిందమ్మ ప్రసాదు షణ్ముగం మొత్తం కార్మికులందరూ పాల్గొన్నారు.
Admin
Famous TV