Famous TV - ఆంధ్రప్రదేశ్ / తిరుపతి : శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయ ,ఫిజిక్స్ విభాగం విశ్రాంతాచార్యులైన డా॥ సి. కె. జయశంకర్ “బెస్ట్ రేర్ ఎర్త్స్ ఔట్రీచ్ అవార్డ్” కు ఎంపికయ్యారు.ఆయన చేసిన కృషికి రేర్ ఎర్త్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఈ ప్రతిష్టాత్మక గుర్తింపునిచ్చింది.17-08-2023న గోవాలో ఇంధన భద్రత కోసం జరిగిన రేర్ ఎర్త్స్ (REES-2023)పై అంతర్జాతీయ సదస్సు ప్రారంభ సెషన్లో ఈ అవార్డును అందుకున్నారు. కాగా ఈ రోజు యస్వీయూ ఉపకులపతి ఆచార్య కె రాజారెడ్డి , రిజిస్ట్రార్ ఆచార్య మహమ్మద్ హుస్సేన్ వీరిని ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో సైన్స్ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ ఆచార్య పద్మావతి, ఫిజిక్స్ హెడ్ ఆచార్య విజయలక్ష్మి, ఆచార్య దేవప్రసాద్ రాజు పాల్గొన్నారు।
Admin
Famous TV