Famous TV - ఆంధ్రప్రదేశ్ / : క్వాలిటీ సర్కిల్ ఫోరమ్ ఆఫ్ ఇండియా తిరుపతి చాప్టర్ 9 వ వార్షికోత్సవ క్వాలిటీ సర్కిల్ పోటీలు ఆ సంస్థ చైర్మన్ జగన్మోహన్ మరియు జనరల్ సెక్రెటరీ శ్రీమతి సులోచన ఆధ్వర్యంలో ఎస్వీ ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలో నేడు అండ్ రేపు (13 మరియు 14 అక్టోబర్ 2023) ఘనంగా ప్రారంభమయ్యాయి. పరిశ్రమంలో పనిచేసే కార్మికులకు వారి పని చేసే ప్రదేశాలలో సమస్యలను పరిష్కరించడానికి తగిన పరిజ్ఞానాన్ని మరియు నైపుణ్యాన్ని ఈ సంస్థ తగిన శిక్షణను క్వాలిటీ సర్కిల్ ఫోరమ్ ఆఫ్ ఇండియా తిరుపతి చాప్టర్ వారికి అందజేస్తుంది అందులో శిక్షణ పొందిన వారు వారి పని ప్రదేశాలలో సమస్యలను పరిష్కారాన్ని కనుగొని యాజమాన్యానికి సమర్పిస్తారు. యాజమాన్యం ఆమోదించిన పరిశీలించి ఆమోదించిన తరువాత వాటిని తిరుపతి చాప్టర్ ఆధ్వర్యంలో జరిగే వార్షికోత్సవ క్వాలిటీ సర్కిల్ పోటీల్లో ప్రదర్శిస్తారు. జటిలమైన సమస్యలకు మెరుగైన పరిష్కారాలు కనుగొన్న బృందాలకు బంగారు మరియు వెండి పథకాలను బహుకరిస్తారు. ప్రతి ఏటా జరిగే ఈ కార్యక్రమంలో దాదాపు 60 సంస్థల నుంచి 250 పైగా బృందాలు, దాదాపు 1500 మంది పైగా ఉద్యోగులు పాల్గొంటారు. ఇందులో పాల్గొని బంగారు పతకాలు సాధించిన వారు జాతీయస్థాయిలోనూ ఆ తర్వాత అంతర్జాతీయ స్థాయిలోనూ పాల్గొని పథకాలు సాధిస్తారని తెలిపారు.ఈ కార్యక్రమం గురించి జనరల్ సెక్రటరీ శ్రీమతి సులోచన మాట్లాడుతూ "తిరుపతి చాప్టర్ పరిధిలో ప్రతి ఏటా దాదాపు 1500 మంది పైగా ఉద్యోగులు పాల్గొంటారని అందులో అర్హత సాధించిన దాదాపు 75 మంది అంతర్జాతీయ స్థాయిలో జరిగే పోటీల్లో పాల్గొంటారని తెలియజేశారు.ఈ కార్యక్రమం పై చైర్మన్ శ్రీ జగన్మోహన్ మాట్లాడుతూ ఈనెల 13 మరియు 14వ తేదీల్లో తిరుపతి చాప్టర్ నిర్వహించే ఈ పోటీలకు దేశంలోనే గుర్తింపు తెచ్చుకున్నాయని తెలియజేసి తెలిపారు. సంస్థ మరియు వ్యక్తుల సభ్యత్వంలో తిరుపతి చాప్టర్ దేశంలోనే మొదటి మూడు స్థానాల్లో ఉందని తెలియజేశారు ఈ కార్యక్రమం కు ముగింపు సమావేశాల్లో నాణ్యతకు పెద్దపీటవేసి వ్యక్తులకు బృందాలకు మరియు సంస్థలకు వివిధ రంగాల్లో ప్రతిభ చూపిన ప్రముఖులను సన్మానించి ప్రశంసా పత్రాలను అందజేస్తాము అని అన్నారు.
Admin
Famous TV