Famous TV - ఆంధ్రప్రదేశ్ / : ఆదివారము: శ్రీ వెంకటేశ్వర వైద్య కళాశాలలో జోనల్ నిరంతర వైద్య విద్య కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన అదనపు వైద్య విద్య సంచాలకులు మరియు ప్రిన్సిపాల్ డాక్టర్ చంద్రశేఖరన్. పోస్ట్ గ్రాడ్యుయేట్ వైద్య విద్యార్థుల కొరకు జోనల్ నిరంతర వైద్య విద్య కార్యక్రమం నేషనల్ మెడికల్ కమిషన్, మరియు రాష్ట్ర వైద్య విద్య సంచాలకుల ఆదేశాల మేరకు ఈ జోనల్ వైద్య విద్య కార్యక్రమం నిర్వహించడం జరిగినది. ఇందులో కుప్పం నుండి పి ఈ ఎస్. వైద్య కళాశాల, కడప నుండి ఫాతిమా వైద్య కళాశాల, చిత్తూరు నుండి అపోలో వైద్య కళాశాలలు పాల్గొన్నాయి. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్. పి . ఏ . చంద్రశేఖరన్ మాట్లాడుతూ ప్రసూతి విభాగ పీజీ వైద్య విద్యార్థులు కు ఇలాంటి నిరంతర వైద్య విద్య కార్యక్రమం పాల్గొనడం వలన గర్భం దాల్చిన స్త్రీలకు, ప్రసవించే సమయంలో కలుగుతున్న పలు ఇబ్బందులను, గురించి తెలుసుకొని వారికి అందించవలసిన మెరుగైన వైద్యం గురించి, ఇందులో చర్చ సమావేశము నిర్వహించినారు. అందుకు కావలసిన నైపుణ్యాన్ని పలు వైద్య కళాశాల నుంచి వచ్చిన పీజీ వైద్య విద్యార్థులు, ప్రసూతి విభాగ వైద్యులు సూచనలు సందేహాలను నిర్వర్తించుకొని, పేద రోగులకు మెరుగైన వైద్యం అందించడానికి నిరంతర వైద్య విద్య కార్యక్రమం ఎంతో దోహదపడుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో రుయా ఆసుపత్రి సూపరిటెండెంట్ డాక్టర్ జి రవి ప్రభు, ప్రసూతి ఆసుపత్రి సూపరిటెండెంట్ డాక్టర్ పార్థసారధి రెడ్డి, ప్రసూతి విభాగాధిపతి డాక్టర్ ప్రమీలదేవి , ఎస్ వి వైద్య కళాశాల వైస్ ప్రిన్సిపాల్స్ (పరిపాలన) , డాక్టర్ వెంకటేశ్వర్లు, డాక్టర్ సత్యనారాయణ మూర్తి అకాడమిక్ (పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ) మరియు డాక్టర్ సాయి వైద్యులు , వైద్య విద్యార్థులు పాల్గొన్నారు.
Admin
Famous TV