Monday, 27 July 2026 07:51:47 AM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

పులికాట్ పై లోకేష్ అసత్య ప్రచారం

మత్స్యకారులపై కపట ప్రేమ ఓట్ల కోసమే లోకేష్ డ్రామా - ఎంపీ గురుమూర్తి

Date : 26 June 2023 03:50 PM Views : 734

Famous TV - ఆంధ్రప్రదేశ్ / తిరుపతి : సూళ్లూరుపేట నియోజకవర్గంలో జరుగుతున్న యువగళం పాదయాత్రలో నారా లోకేష్ పులికాట్ ముఖద్వారం పూడిక తీత గురించి పరుష పదజాలంతో మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన హామిని విస్మరించారు అనే లోకేష్ విమర్శలను తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి తీవ్రంగా ఖండించారు. గూడూరు నియోజకవర్గం రాయదొరువు వద్ద పులికాట్ సరస్సు ముఖద్వారం వద్ద పూడిక తొలగించే కార్యక్రమానికి సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు సూచనలతో ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వ మరియు రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళుతున్న విషయం అందరికీ విధితమే ఇటీవల కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్ జలమార్గాల మంత్రిత్వ శాఖను సంప్రదించగా కేంద్ర మత్స్యశాఖ అనుమతుల కోసం లేఖ రాసారని మత్స్యశాఖ అనుమతి వచ్చిన వెంటనే ఆర్థిక శాఖ అనుమతితో రూ.128 కోట్లతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమాన భాగస్వామ్యంతో పూడిక తీత పనులు జరుగుతాయి అని ఆయన అన్నారు. ఎప్పటికప్పుడు మీడియా ద్వారా ఈ విషయాన్ని ప్రజలకి తెలియజేస్తున్న విషయం పాపం లోకేష్ కి తెలిసినట్లు లేదు, మాట్లాడేందుకు సమస్యలు ఏమి లేక నోటికొచ్చింది మాట్లాడటం చేతికి రాసిచ్చింది చదవడం ఊక దంపుడు ఉపన్యాసాలతో మత్స్యకారులపై కపట ప్రేమ వలకబోస్తున్నాడని ఎంపీ గురుమూర్తి ఎద్దేవా చేసారు. సముద్రంలో చేపల వేట నిషేధ సమయంలో ఉపాధి కోల్పోయే అర్హులైన మత్స్యకారులకు అండగా ఉండేందుకు వైయస్సార్ మత్స్యకార భరోసా పథకంతో 21 నుంచి 60 సంవత్సరాల వయసు కలిగిన 1.32 లక్షల మందికి మత్స్యకార భరోసా కింద 10 వేల రూపాయలు అందిస్తూ మత్స్యకారులకి ఏదైనా మేలు చేసిన ప్రభుత్వం ఉందంటే అది జగన్మోహన్ రెడ్డి ఆదర్వంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే అని ఆయన అన్నారు

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: