Famous TV - క్రైమ్ వార్తలు / చిత్తూరు : కుప్పం ఫేమస్ టీవి న్యూస్: కుప్పం మండలం నారాయణపురం గ్రామంలో వెలుగుచూసిన దారుణం,అప్పు తీర్చలేదని చెట్టు కట్టేసి మహిళను చిత్రహింసలు నారాయణపురం గ్రామానికి చెందిన శిరీష వయస్సు (25) భర్త తిమ్మరాయప్ప అదే గ్రామానికి చెందిన మునికన్నప్ప వద్ద 3 సంవత్సరాల క్రితం 80,000 వేలు రూపాయలు అప్పు తీసుకున్నారు. అప్పు తీర్చలేక భార్య శిరీష (25) బిడ్డలను గ్రామాన్ని వదిలి వెళ్ళిపోయిన భర్త తిమ్మరాయప్ప.కూలీ పనులు చేసుకుంటూ పిల్లలు పోషించుకుంటూ అప్పులు తీరుస్తున్న శిరీష.. సకాలంలో చెల్లించలేదని రోడ్డుపై వెళ్తుండగా అప్పు తీర్చగలరని అసభ్యకరమైన పదజాలంతో దూషించి తన అప్పుడబ్బులు ఇవ్వకపోతే చంపిస్తామని బెదిరింపులు. ఈడ్చుకొంటూ వెళ్ళి తాడుతో బలవంతంగా వేప చెట్టు కు శిరీష ను కట్టేసిన కొట్టిన మునికన్నప్ప, స్థానికులను బెదిరించి సెల్ ఫోన్ లో చిత్రీకరిస్తున్న వారిపై భౌతిక దాడి చేసిన మునికన్నప్ప కుప్పం పోలీసులకు సమాచారం ఇచ్చిన స్థానికులు.టిడిపి కార్యకర్త మునికన్నప్పపై బి.యన్.యస్. 341/323/324/506/34 సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు, పోలీసులు మునికన్నప్పను అదుపులోకి తీసుకున్నారు.
Admin
Famous TV