Famous TV - క్రైమ్ వార్తలు / : రోజురోజుకీ టెక్నాలజీ అభివృద్ధి చెందుతూ సరికొత్త ఫీచర్స్, ఆప్షన్స్ తో మొబైల్స్, యాప్స్ అప్డేట్ అవుతూ ఉంటాయి. ఇదే అదునుగా భావించి సైబర్ నేరగాళ్లు వాట్సప్ పింక్ అనే లింకును వాట్సాప్ యూజర్లకు పంపిస్తారు. పొరపాటున ఆ లింకును క్లిక్ చేయగానే వాట్సప్ అప్డేట్ అవుతున్నట్లు గ్రీన్ కలర్ వాట్సాప్ లోగో బ్యాక్ గ్రౌండ్ పింక్ కలర్ లోకి మార్పు చెందుతుంది. అప్పటి నుండి మొబైల్ లో ఉన్న ఫోటోలు, వీడియోలు, కాంటాక్ట్ నెంబర్లు, బ్యాంకు వివరాలు, ఇతరత్రా వ్యక్తిగత సమాచారం సైబర్ నేరగాళ్ల చేతికి చేరుతాయి. అనంతరం రిజిస్ట్రేషన్ కోసం అంటూ వ్యక్తిగత వివరాలను సేకరించి మొబైల్ నెంబర్ కు ఓటిపి ని సైబర్ నేరగాళ్లు పంపుతారు. మెసేజ్ వచ్చిన ఓటీపీని మొబైల్ నందు ఎంటర్ చేయగానే మన మొబైల్ పూర్తిగా సైబర్ నేరగాళ్ల చేత రిమోట్ కంట్రోల్ యాక్సెస్ చేయబడుతుంది, మీ మొబైల్ మీ నియంత్రణ కోల్పోయి సైబర్ నేరగాళ్ల చేత నియంత్రించబడుతుందని తెలిపారు. తర్వాత గంటల వ్యవధిలోనే బ్యాంకు అకౌంట్ లో ఉన్న నగదు మాయం అవుతూ వస్తుంది. మీ కాంటాక్ట్ నెంబర్లకు తరచుగా పింక్ వాట్సప్ లింక్ ఫార్వర్డ్ చేయబడుతూనే ఉంటుంది. మీ కాంటాక్ట్ నెంబర్లలో వాట్సాప్ వాడే మొబైల్ యూసర్లు అందరికీ వాట్సప్ పింక్ లింకు క్లిక్ చేసేంతవరకు ఫార్వర్డ్ అవుతూనే ఉంటుందని అన్నారు. ప్రజలు ఎవరైనా ఈ తరహాలో మోసపోయి ఉంటే వెంటనే గోల్డెన్ అవర్ లోగా సైబర్ సెల్ కంప్లైంట్ నెంబర్ 1930 కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలి లేదా తిరుపతి సైబర్ సెల్ పోలీస్ వారికి ఫిర్యాదు చేసినట్లయితే సకాలంలో బాధితులకు న్యాయం చేస్తామని తెలిపారు.
Admin
Famous TV