Famous TV - క్రైమ్ వార్తలు / చిత్తూరు : చౌడేపల్లి ఫేమస్ టీవి న్యూస్ : చిత్తూరు జిల్లా, చౌడేపల్లి మండలం లోని లద్దిగం గ్రామ పంచాయతీ లద్దిగం యస్సి కాలనీకి చెందిన రమేష్ భార్య నాగలక్ష్మి(28) లద్దిగం నుండి పుంగనూరు లోగల నక్కబండ కు వెళ్ళి వస్తానని చెప్పి ఈనెల 14 ఇంటి నుండి వెళ్ళినది.అక్కడికి కూడా వెళ్ళకుండా ఎటోవెళ్ళిపోయింది. అప్పటి నుండి కుటుంబ సభ్యులు చుట్టుపక్కల గ్రామాలలో, బంధువుల ఇండ్లలో వెతికారు. 17 న చౌడేపల్లి పోలీసులను ఆశ్రయించారు. విషయం తెలుసుకున్న ఎస్సై నాగేశ్వరావు కేసు 70/2025 నమోదు చేసి దర్యాప్తు చేపట్టడం జరిగిందని,ఎవరికైనా ఆచూకీ తెలిసిన యడల చౌడేపల్లి పోలీసులను సంప్రదించాలని వారు తెలిపారు.
Admin
Famous TV