Sunday, 26 July 2026 07:34:22 AM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

గుప్తనిధుల తవ్వకాల ముఠాను పట్టుకున్న పంజాణి పోలీసులు

Date : 12 October 2025 10:03 PM Views : 761

Famous TV - క్రైమ్ వార్తలు / చిత్తూరు : పలమనేరు ఫేమస్ న్యూస్ : చిత్తూరు జిల్లా పెద్దపంజాణి నందు గుప్త నిధుల తవ్వకాలపై ఎనిమిది మందిని అరెస్ట్ చేసిన పంజాని పోలీసులు. నిన్న (11-10-25) రాత్రి పెద్దపంజాణి మండలంలోని వీరప్పల్లె గ్రామ పరిసరాల్లో అక్రమంగా గుప్త నిధుల తవ్వకాలు చేస్తున్న ఏడుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాలు: కెళవతి గ్రామానికి చెందిన యెర్రబల్లి శ్రీనివాసులు (పూర్వ MPTC, ప్రస్తుతం వైఎస్సార్సీపీ చిత్తూరు జిల్లా కార్యదర్శి) తన తమ్ముడు సరవణతో కలిసి నిధి వేటకు కుట్ర పన్నారు. పుంగనూరుకు చెందిన పూజారి అంబిక స్వామి సూచనలతో వీరప్పల్లె సమీపంలో పూజలు నిర్వహించి తవ్వక స్థలాన్ని గుర్తించారు. తర్వాత మాజీ పోలీస్ సిబ్బంది వినోద్ కుమార్ (మాజీ ARHC-157, DAR చిత్తూరు) ను సంప్రదించి జేసీబీ, మెటల్ స్కానర్, మరియు మరికొందరితో కలిసి అక్టోబర్ 11వ తేదీ రాత్రి తవ్వకాలు ప్రారంభించారు. ఈ తవ్వకాలపై వచ్చిన సమాచారం మేరకు పలమనేరు అర్బన్ ఇన్స్పెక్టర్ మురళీ మోహన్,రూరల్ ఇన్స్పెక్టర్ పరశురాముడు ఆదేశాలపై పలమనేరు అర్బన్ ఎస్ఐ లోకేష్, మరియు పంజాని పోలీస్ స్టేషన్ పీఎస్ఐ మారెప్ప నేతృత్వంలో దాడి చేసి, ఏడుగురిని అదుపులోకి తీసుకుని జేసీబీ యంత్రం, కారు, నాలుగు బైకులు స్వాధీనం చేసుకున్నారు.ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ముద్దాయి వివరాలు: వై. శ్రీనివాసులు, వయసు 50 సంవత్సరాలు, తండ్రి పేరు: కృష్ణప్ప, గ్రామం: కెళవతి, మండలం: పెద్దపంజాణి.వై. సరవణ, వయసు 43 సంవత్సరాలు, తండ్రి పేరు: కృష్ణప్ప, వృత్తి: ఎయిర్ కంప్రెషన్ టెక్నీషియన్, నివాసం: చెన్నై.బి.శ్రీనివాసులు, వయసు 47 సంవత్సరాలు, తండ్రి పేరు: లక్ష్మయ్య, గ్రామం: బండ్లపల్లి, మండలం: పుంగనూరు,బి.ప్రకాశ్, వయసు 47 సంవత్సరాలు, తండ్రి పేరు: లక్ష్మయ్య, జాతి: గ్రామం: బండ్లపల్లి, మండలం: పుంగనూరు, సి.శ్రీనివాసరెడ్డి, వయసు 34 సంవత్సరాలు, తండ్రి పేరు: సుబ్బారెడ్డి, గ్రామం: బండపల్లి, మండలం: పుంగనూరు.కాణిపాకం రమేష్, వయసు 30 సంవత్సరాలు, తండ్రి పేరు: పి. త్యాగరాజులు, గ్రామం: సిద్దంపల్లి, మండలం: తవనంపల్లి. వృత్తి: వెల్డింగ్ పని, జె. సునీల్, వయసు 33 సంవత్సరాలు, తండ్రి పేరు: జె. సత్య, వృత్తి: జేసీబీ డ్రైవర్, గ్రామం: బండకిందపల్లి, మండలం: కలికిరి. తప్పించుకున్నవారు శ్రీనివాసులు - ఎ.కొత్తకోట, మండలం:చౌడేపల్లి.వినోద్ కుమార్,గ్రామం: చౌడేపల్లి.చిత్తూరు వెంకటేష్, కట్టిమంచి, వృత్తి: ఎలక్ట్రిషియన్. సంతోష్ రెడ్డి(జేసీబీ యజమాని) మరియు అతని స్నేహితుడు,చిత్తూరుకు చెందిన ఇద్దరు స్వామీజీలు (తప్పించుకున్నారు)

Vuttaradi Hariprasad

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :