Famous TV - క్రైమ్ వార్తలు / చిత్తూరు : చిత్తూరు ఫేమస్ టీవి న్యూస్ : సెంటర్ ఫర్ ఆక్ట్స్ అండ్ రైట్స్ డెవలప్మెంట్ సొసైటీ అధ్యక్షురాలు ఉత్తరాది గీత ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ చిత్తూరు జిల్లా, చౌడేపల్లి మండలం లో చాలా వరకు బాల్యవివాహాలు జరుగుతున్నాయని, ఈ బాల్యవివాహాలను స్థానిక రాజకీయ నాయకులు ప్రోత్సహిస్తున్నారని ఆవిడ వాపోయారు.ఈ మద్య ఒక గ్రామంలో 17 సంవత్సరాల మైనర్ బాలికకు తల్లి,తండ్రి, అన్న, అక్క, బావ, మేనత్తలు కలసి బాల్యవివాహం చేశారని, దీనికి సంబందించిన వివరాలు ఒక స్వచ్చంద సేవా సంస్థ వారు పోలీస్ వాట్సప్ కు పిర్యాదు చేశారని, ఐతే ఈ బాల్యవివాహం విషయం లో ఒక వ్యక్తి తనదైన శైలిలో రాజకీయం చేసినట్లు పుకార్లు వినిపిస్తున్నాయని, అలాగే చౌడేపల్లి పట్టణంలో కూడా ఒక బాల్యవివాహం జరిగిందని, ఈ విషయం కూడా పోలీసులకు తెలిసిందని, పోలీసులు బాల్యవివాహం విషయం బయటకు చెప్పడంతో సదరు గ్రామాలలో గొడవలు శృష్టిస్తున్నారని, ఆవిడ వాపోయినది. ఈ విషయం పై త్వరలో జిల్లా అధికారులను కలసి పిర్యాదు చేయనున్నట్లు ఉత్తరాది గీత అన్నారు. ఒకపక్క బాల్యవివాహాల పై ప్రభుత్వం ఖటినమైన నిర్ణయాలు తీసుకొంటుంటే ఇక్కడ మాత్రం స్థానిక రాజకీయ నాయకుల కనుసన్నలలో బల్యవివాహాలు ప్రోత్సహిస్తున్నారు. ఇక నైనా అధికారులు సమోటోగా కేసులు నమోదుచేసుకొని, బాల్యవివాహాలు చేసిన తల్లిదండ్రుల పై,వారికి మద్దతునిచ్చిన కుటుంబ సభ్యూల పై, రాజకీయ నాయకులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆవిడ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సెంటర్ ఫర్ ఆక్ట్స్ అండ్ రైట్స్ డెవలప్మెంట్ సొసైటీ సభ్యులు పాల్గొన్నారు.
Admin
Famous TV