Famous TV - భక్తి / : పూతలపట్టు,పేటమిట్ట,27-03-2024: అమరరాజ సంస్థల అధినేత డాక్టర్ శ్రీ గల్లా రామచంద్ర నాయుడు గారు తమ స్వగ్రామమునందు శ్రీ కోదండరామ స్వామి వారి దేవస్థానాన్ని నూతనంగా నిర్మించి,గత ఫిబ్రవరి నెల13,14,15వ తేదీ లలో స్వామి వార్ల విగ్రహ ప్రతిష్ట కుంభాభిషేక మహోత్సవాలను ఘనంగా నిర్వహించారు. స్వామి వారి విగ్రహ ప్రతిష్ట జరిగిన 41 రోజులకు గాను నిన్న మరియు ఈరోజు పేటమిట్ట శ్రీ కోదండరామ స్వామి వారి దేవస్థానం నందు మండల పూజను ఘనంగా నిర్వహించారు. అందులో భాగంగా నిన్న 26-03-2024 మంగళవారం నాడు ఉదయం 10:00 గంటలకు అంకురార్పణ, కలశ స్థాపన, కంకణ ధారణ, వాస్తు హోమం వంటి పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఈరోజు 27-03-2024 బుధవారం నాడు ఉదయం 7:00గంటలకు నుంచి కలశారాధన, నిత్య పూజ మహోత్సవాలు, మూర్తి హోమములు ,శక్తి హోమం,పూర్ణాహుతి పుణ్యతీర్థా పంచామృత అభిషేకం వంటి పూజా కార్యక్రమాలను శ్రీమతి గల్లా అరుణ కుమారి గారు, శ్రీ గల్లా రామచంద్ర నాయుడు గారి చేతుల మీదుగా ఘనంగా నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్నభక్తులకు దాదాపు 1000 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. స్వామి వారి సేవలో శ్రీ మతి గల్లా అరుణ కుమారి గారు, శ్రీ గల్లా రామచంద్ర నాయుడు గారు, గల్లా పద్మావతి, గౌరనేని రమాదేవి, ప్రముఖ రచయితలు నామిని సుబ్రహ్మణ్యం,సాకం నాగరాజు,నాయకులు బడి సుధ యాదవ్, బాలకృష్ణారెడ్డి, గల్లా రాధాకృష్ణ సర్పంచ్, ట్రస్ట్ సెక్రటరీ గల్లా రాజశేఖర్, ట్రెజరర్ గల్లా రామానాయుడు, సభ్యులు భానుమూర్తి నాయుడు, ఇతర ట్రస్ట్ సభ్యులు, పేటమిట్ట మరియు సమీప గ్రామ ప్రజలు, భక్తులు పాల్గొన్నారు.
Admin
Famous TV