Famous TV - భక్తి / తిరుపతి : శ్రీకాళహస్తి దేవస్థానంలో రాహు కేతు పూజ మండపాలను శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ధర్మకర్త మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు తనిఖీ చేశారు. ఆదివారం రాహుకాల సమయంలో పూజలకు అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. 500 రూపాయల రాహు కేతు పూజ మండపాన్ని శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ధర్మకర్త మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు తనిఖీ చేసి అక్కడ భక్తులకు సదుపాయాలు గురించి ఆరా తీశారు. ఆలయ సిబ్బంది పూజారులను భక్తులు సంతృప్తి చెందే విధంగా పూజలు నిర్వహించాలని ఆదేశించారు. పూజల అనంతరం భక్తులు దర్శనానికి వెళ్లేందుకు సహకరించాలని దేవస్థానం సిబ్బందిని ఆదేశించారు. ఆలయంలో రద్దీని నియంత్రిస్తూ దళారీలను నియంత్రించేందుకు శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ధర్మకర్త మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు స్వీయ పర్యవేక్షణ చేపట్టారు. మహద్వారం వద్ద రాహుకాలం సమయంలో క్యూ లైన్ పర్యవేక్షణ చేపట్టి దళారీల నియంత్రణ చేపట్టారు. అడ్డదారిలో దర్శనాలు తీసుకెళ్లే వారిని నియంత్రించి, టికెట్ ఉన్న భక్తులను మాత్రమే దర్శనానికి అనుమతించారు. సామాన్య భక్తులు ఉన్న క్యూలైన్లను పర్యవేక్షణ చేస్తూ వారు త్వరగా దర్శనం చేసుకున్న విధంగా చర్యలు చేపట్టారు.ఈ కార్యక్రమంలో దేవస్థానం అధికారులు ఎస్పీఎఫ్ సిబ్బంది సెక్యూరిటీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Admin
Famous TV