Famous TV - భక్తి / తిరుపతి : తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆదివారం రోజున భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారిని దర్శించుకోవడానికి భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమలకు పోటెత్తారు. టోకెన్ రహిత సర్వదర్శనానికి క్యూ కాంప్లెక్స్లోని కంపార్టుమెంట్లు అన్నీ నిండిపోయి క్యూలైన్లు వెలుపలికి వచ్చాయి. సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. కాగా నిన్న శనివారం శ్రీవారికి నాలుగు కోట్ల రూపాయల హుండీ ఆదాయం వచ్చింది. 85,366 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా.. 48,183 మంది భక్తులు తలనీలాలు సమర్పించినట్లు టీటీడీ అధికారులు తెలిపారు
Admin
Famous TV