Famous TV - భక్తి / తిరుపతి : కాలభైరవ ఆలయంలో జీర్ణోదరణ ఆధునీకరణ పనులను శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ధర్మకర్త మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు పరిశీలన చేశారు. శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం అనుబంధం దేవాలయమైన కైలాసగిరి కొండల్లో వెలిసి ఉన్న శ్రీ కాలభైరవ స్వామి ఆలయ జీర్ణ ధారణ ఆధునీకరణ పనులు ముగింపు దశకు రావడంతో పనులను శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ధర్మకర్త మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు పరిశీలన చేశారు. ఈ నెల 25వ తేదీ ఆలయ మహా కుంభాభిషేకం నిర్వహించనున్న నేపథ్యంలో తుది దశకు చేరిన పనులను పరిశీలించి ఎక్కడ కూడా చిన్న పనులు కూడా విడిచిపెట్టకుండా పూర్తి చేయాలని తగు సూచనలు చేశారు. ఆలయానికి సున్నాలు రంగులు వేసే పనులు ముమ్మరంగా నిర్వహిస్తున్నారు. పనులన్నిటినీ త్వరగా పూర్తిచేసి మహా కుంభాభిషేకం ఏర్పాట్లు చేయాలని ఇంజనీరింగ్ శాఖను శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ధర్మకర్త మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు ఆదేశించారు. అదేవిధంగా శ్రీ కాలభైరవ స్వామి ఆలయలో ఆధ్యాత్మికంగా వాతావరణంలో ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఇంజనీరింగ్ శాఖ అధికారులు ఏఈ పవన్ కుమార్, సపతి కుమార్ మరియు పట్టణ ప్రముఖులు పసల కుమారస్వామి, రమేష్, మురళి మరియు ఆలయ పూజారి మోహన్ శర్మ, దేవస్థానం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Admin
Famous TV