Famous TV - విద్య ఉద్యోగాలు / తిరుపతి : తిరుపతి ఎస్పీ ఎల్ సుబ్బరాయుడుతో శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ఆచార్య భూపతి నాయుడు సోమవారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై వారిరువురు చర్చించారు. రాష్ట్రంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన విశ్వవిద్యాలయం కావడంతో ఎస్వీయూలో శాంతిభద్రతల అంశానికి అధిక ప్రాధాన్యమివ్వాలని ఇరువురు నిర్ణయించారు. వర్శిటీలో ర్యాగింగ్ ఛాయలు లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు రిజిస్ట్రార్ వివరించారు. ర్యాగింగ్, డ్రగ్స్ పట్ల విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసి విద్యార్థులను చైతన్యవంతం చేయాలని ఎస్పీ కోరారు. ఎస్వీయూలో నాణ్యమైన విద్యతో పాటుగా ఉద్యోగావకాశాల కల్పన పైనా దృష్టిసారిస్తున్నట్లు రిజిస్ట్రార్ పేర్కొన్నారు. ఎస్పీ, రిజిస్ట్రార్ మధ్య జరిగిన సుదీర్ఘ చర్చలో మరిన్ని కీలక అంశాలు ప్రస్తావనకు వచ్చాయి.
Admin
Famous TV