Famous TV - విద్య ఉద్యోగాలు / తిరుపతి : తిరుపతి బాలోత్సవం మరియు వేమన విజ్ఞాన కేంద్రం వేమన పద్యానికి పట్టాభిషేకం కార్యక్రమంను తిరుపతి యం . జీ. యం హై స్కూల్ నందు తిరుపతి బాలోత్సవం నిర్వాహకులు దామోదరం గారు మరియు హెచ్. యం మురగన్ గారు ,, నెల్లూరు మునీలక్ష్మీ గారు, ,మునిరామయ్య గారు ,లావణ్య గారు,సుకుమార్ గారు మరియు తెలుగు ఉపాధ్యాయులు పాటశాలల సిబ్బంది పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు..తిరుపతి లోని అన్ని పాటశాల తెలుగు ఉపాధ్యాయులు పిల్లలను ఎంతో ఉత్సాహంగా తీసుకొని రావడం జరిగింది. సుమారుగా 350 మంది చిన్నారులు ఈ వేమన పద్యానికి పట్టాభిషేకం కార్యక్రమం లో పాల్గొన్నారు తల్లిదండ్రులు చిన్నారులను ఎంతో చక్కగా తీసుకొని రావడం జరిగింది..మూడు రోజులుగా రేణిగుంట,పచ్చికాపల్లం, పుత్తూరు తిరుపతి వివిధ ప్రాంతాలలో జరిగిన ఈ వేమన పద్యానికి పట్టాభిషేకం కార్యక్రమానికి సుమారుగా 1200 మంది పిల్లలు పాల్గొని విశేష స్పందన రావడం జరిగిందని బాలోత్సవం అధ్యక్షులు దామోదరం గారు,నడ్డి నారాయణ గారు, నాగార్జున గారు, గురునాథం గారు, రెడ్డప్ప గారు, డాక్టర్ నెల్లూరు మునిలక్ష్మి గారు ,మునిరామయ్యగారు ,ఓ. వీ.రమణ గారు ,మల్లేశ్వర రావు గారు, తదితరులు తెలిపారు .వానకి తడవని వాడు ఉండడు వేమన పద్యం తెలియని వాడు ఉండడు అలాంటి వేమన పద్యాలను చిన్నారులకు తెలియచేస్తూ సమాజం లోని విలువలని పెంపొందించే విధంగా చేయడమే వేమన విజ్ఞాన కేంద్రం ప్రధాన లక్ష్యం ఈ నెల అక్టోబర్ 29 వ తేదీన ఘనంగా యశోదా నగర్ వేమన విజ్ఞానకేంద్రం ప్రారంభం కానున్నది ..ఈ వేమన పద్యానికి పట్టాభిషేకం పోటీలలో పాల్గొన్న విజేతలకు వేమన విజ్ఞాన కేంద్రం వద్ద అక్టోబర్ 29 వ తేదీన బహుమతులు అందించడం జరుగుతుంది అని దామోదరం గారు తెలిపారు
Admin
Famous TV